Vijayendra Prasad Hints About SS Rajamouli And Mahesh babu Film :
ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ఎస్. ఎస్. రాజమౌళి అనే అందరూ చెబుతారు. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ ముగింపు దశలో ఉంది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ప్రిన్స్ మహేష్ తో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. మరి రాజమౌళి సినిమా చేయాలంటే కథ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గరనుంచి రావలసిందే. ఇంతకీ ఈ సినిమాని ఎవరికి చేయాలన్నది మరో అంశం. దీనిపై స్పష్టత వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ ఇప్పటికే ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది.
రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ అవుతుంది కాబట్టి వేరే నిర్మాతలు కూడా తోడవుతుంటారు. దుర్గా ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్. గోపాల్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్యూలో ప్రకటించారు. కథ విషయంలో రాజమౌళి మదిలో ఏముందో తెలియని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు కథ విషయంలోనూ కొంత స్పష్టత వచ్చేసింది. రాజమౌళికి కథలు ఇచ్చే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ క్లూ అయితే ఇచ్చారు. తను, తన కుమారుడు దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ కు అభిమానులమని చెప్పారు.
మహేష్ బాబుతో చేయడానికి కథ కావాలన్నప్పుడు కూడా తనకేం కావాలో చెప్పారన్నాడన్నారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ ఉండాలనడంతో అలాంటి కసరత్తే చేస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దక్షిణాఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. విల్బర్ స్మిత్ రాసిన నవల ప్రేరణతోనే ఈ కథను తయారు చేయనున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. విల్బర్ స్మిత్ అనేక నవలలు రాశారు. ఒక్కో నవల ఒక్కో ఆణిముత్యం.
ఈ నవలలు శోధించి ఓ మంచి కథ రాయాలనుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. 2023లో దీన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. అయితే రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది. పైగా ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అంటున్నారు. దీని బడ్జెట్ కూడా దాదాపు రూ. 500 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ విడుదలైతేగాని రాజమౌళి – మహేష్ బాబుల మూవీ మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Must Read ;- రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అదిరింది.. సరికొత్త రికార్డులు ఖాయం











