సిక్కోల్లో వైసీపీ ఉన్మాదం!
ఉత్తరాంధ్రలో అధికార వైసీపీ బరితెగింపు రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఉన్మాదం నెక్స్ట్ లెవల్ అన్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తే.. ప్రజలు, విపక్షాలపై బెదిరింపులకు దిగుతున్నారు. దాడులకు తెగపడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అధికారపార్టీని ప్రశ్నించారని శ్రీకాకుళంలో తెదేపా కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణం విడిచాడు. దీనిపై తెలుగు దేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశ్నిస్తే వేదిస్తారా? అంటూ నిలదీశారు. పోలీసులు వైఖరి చూస్తే.. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? లేక వైసీపీ నాయకుల అనుచరులా అనే అనుమానం వస్తోందని నారా లోకేష్ ధ్వజమెత్తారు.
మృతుడి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి..
శ్రీకాకుళం జిల్లా పొత్తంగి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోన వెంకట్రావు సామాజిక మాధ్యమాల్లో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వెంకట్రావును మానసికంగా హింసించి, పలు కేసులతో వేదించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న వెంకట్రావును టార్గెట్ చేసి మరి చిత్ర హింసలకు పాల్పడ్డారు అధికారపార్టీ నేతలు. దీంతో ఆ మానసిక క్షోభను భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆత్మహత్య కాదు.. ఇది ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెదేపా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రశక్తే లేదని తేల్చి చెప్పారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, వెంకట్రావు మృతికి కారకులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయకుంటే.. న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
Must Read:-ఇది మా రైతుల మొదటి దెబ్బ జగన్ రెడ్డి | Amaravati Farmers Strong Warning to YS Jagan | Leo News