దేశ్కీ నేతా కేసీఆర్ తంత్రం.. దీదీ మంత్రం ఫలించేనా?
పశ్చిమ బెంగాల్ సీఎం మమత సారధ్యంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఒక తాటిపైకి తెచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు తగినట్లు బీజేపీ వైరి పక్షాలను కూటమిగా ఏర్పాటు చేసేందుకు దీదీ అందుకున్న మంత్రం ‘బీజేపీ ముక్త భారత్’! దీనిని కేసీఆర్ తన దైనశైలి తలకెత్తుకున్నాయి! బీజేపీపై ప్రత్యక్ష యుద్దానికి దిగారు!! అందులో భాగంగా కేసీఆర్ ప్రదర్శిస్తున్న రాజకీయ తంత్రం దేశ ప్రజలను ఆకర్షిస్తోంది! ఈనేపధ్యంలో బీజేపేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కేసీఆర్ కదుపుతున్న పావుల్లో భాగస్వాములయ్యారు. ఇదిలా ఉంటే కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు ముమ్మరంగానే చేశారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఇలాకా అయిన గుజరాత్ తోపాటు, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలోనూ.. కేసీఆర్ బర్తడే కటౌట్లు, ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో వెలిశారు. ‘‘దేశ్ కీ నేతా.. కేసీఆర్ అంటూ ఇంగ్లీసు, హిందీలో జరుగుతున్న ప్రచారం..’’ అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇకపోతే పూరీలోని సముద్ర తీరం వద్ద సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన కేసీఆర్ సైకత శిల్పం జాతీయ నేతల దృష్టి అమాంతం తన వైపు మరిలించేలా చేసుకున్నారు కేసీఆర్!
విశాఖలో కేసీఆర్ ఫ్లెక్సీలు..
కాంగ్రెస్ తో పాటు కేసీఆర్ను ఆంధ్ర ద్రోహులుగా భావించే ఏపీ కూడా సీఎం కేసీఆర్ కు అభిమానులున్నారు. విశాఖలోని ప్రధాన కూడళ్లలో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘దేశానికి అవసరమైన జనహృదయనేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మద్దిలపాలెం, సత్యం జంక్షన్, గురుద్వార, స్పెన్సర్స్, సిరిపురం జంక్షన్లతో ఈ ఫెక్సీలను గురువారం అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారి వివరాలు కానీ, ఎవరు వీటిని ఏర్పాటు చేశారు అన్న సమాచారం బయటకు రాకుండా గోప్తత పాటించడం విశేషం!
Must Read:-కేసీఆర్ టాప్ గేర్..! జనంతోనే జీవితం..!!