తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. వీటిలో పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్ లో, తమిళనాడు (ఏఐఏడీఎంకే కూటమి)లో అధికారంలోకి వచ్చేందుకు కొన్నాళ్లుగా ఆపరేషన్లు మొదలుపెట్టింది. పశ్చిమబెంగాల్ లో 2017నుంచే బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ అధికార AITC (తృణమూల్కాంగ్రెస్) అధినేత మమత బెనర్జీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో అధికాంరంలోకి వచ్చేందుకు 148 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి 7.3కోట్ల ఓటర్లుండగా మార్చి 27న మొదటిపోలింగ్, ఏప్రిల్ 29న చివరి దశ (8)పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మొదటివిడత పూర్తయింది. రెండో విడతకోసం పార్టీలు అన్ని శక్తులనూ రంగంలోకి దింపాయి. ఇప్పటికే మతాలు, ప్రాంతాలు, జైశ్రీరాం, శైకాళీమా, బెంగాలీ VS గుజరాతీ, బీజేపీని దెయ్యంతో పోల్చడంతోపాటు తాజాగా మమత బెనర్జీ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్నవారిని దుర్యోనులు, దుశ్శాసనులతో పోల్చారు. అదే సమయంలో బీజేపీ కూడా దాదాపు 8మంది కీలకనేతలను తమపార్టీలోకి చేర్చుకుంది. తృణమూల్ లో నెం.2 హోదాలో ఉన్న సువేందు అధికారిని కూడా చేర్చుకోవడంతోపాటు ఆ మధ్య కాలంలో మమత బెనర్జీ బంధువుల ఇళ్లపై సీబీఐ, ఈడీ దాడులూ జరిగాయి. ఇక మమత బెనర్జీపై దాడి (తృణమూల్ చెబుతున్నా..ఆధారాలు లేవు) వ్యవహారం పశ్చిమబెంగాల్ లో పరిణామాలు మారేందుకు కారణమైంది. ఇక ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన విషయంలోనూ మమత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. NRC, CAA లను తెరపైకి తెచ్చారు. అదే సమయంలో మోదీ, అమిత్ షా, నడ్డాతోపాటు బీజేపీ నేతలంతా పలు విమర్శలు చేస్తూ మమతాబెనర్జీని టార్గెట్ చేశారని చెప్పవచ్చు. మమత పోటీ చేస్తున్న నందిగ్రమ్ లో తనను గెలిపించేందుకు సహకరించాలని బీజేపీ నేతకు మమత ఫోన్ చేసి చెప్పారనే అంశంపై ఆడియో కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడియో సంచలనం రేపుతోంది. ఇది ఫేక్ ఆడియో అని తృణమూల్ వ్యాఖ్యానిస్తోంది.మొత్తంమీద తొలిసారిగా పశ్చిమబెంగాల్ లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, తన పట్టు నిలుపుకునేందుకు తృణమూల్ అదే స్థాయిలో కౌంటర్ లు ఇస్తోంది.
తమిళనాడులో స్టాలిన్..
తమిళనాడులో ప్రస్తుతంAIADMK ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం జయలలిత చనిపోయాక పన్నీర్ సెల్వం కొన్నాళ్లపాటు సీఎంగా ఉండగా తరువాత పళని స్వామి సీఎం అయ్యారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అక్కడ కీలకంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి AIADMK 20సీట్లు కేటాయించింది. అయితే 20సీట్లే కేటాయించినా.. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తమిళనాడులో అధికారంలో ఉండడం బీజేపీకి అవసరం. దీంతో సీట్లు తక్కువగా తీసుకున్నా..బీజేపీ మాత్రం ముమ్మర ప్రచారం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, డీఎంకేల పొత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ కు డీఎంకే 25స్థానాలు కేటాయించింది. మొత్తం మీద డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టాలిన్ పై విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఉచిత వాషింగ్ మెషిన్, విద్యుత్తు ఫ్రీ లాంటి హామీలను డీఎంకే పార్టీ ప్రకటించింది. మొన్న బీజేపీ సభలో స్టాలిన్ పై పలు ఆరోపణలు బీజేపీ చేసిన నేపథ్యంలో స్టాలిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశంలోని సీబీఐ, ఆదాయపు పన్ను, ఈడీ, న్యాయవ్యవస్థ తదితర అంశాలను వాడుకుని, బెదిరించి అధికారంలోకి రావాలనుకుంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)పై డీఎంకే నేత, ఎంపీ ఎ రాజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. థౌజండ్ లైట్ నియోజవకర్గంలో రాజా మాట్లడుతూ డీఎంకే చీఫ్ స్టాలిన్, ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వాల మధ్య ఉన్న తేడాను చెప్పే యత్నంలో భాగంగా స్టాలిన్ పూర్తి పరిణితి కలిగిన వ్యక్తి అని వ్యాఖ్యానించడంతోపాటు ఈపీఎస్ రాజకీయ కెరియర్ అక్రమ సంబంధానికి నెలలు నిండకుండానే పుట్టిన శిశువులాంటిదిఅని కామెంట్ చేయడంతోపాటు ఈపీఎస్కు.. స్టాలిన్ కాలి చెప్పులంత విలువ కూడా లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి రావాలంటే 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది.
Must Read ;- కమల వికాసానికి బ్రేక్.. ప్రజల నాడిని పట్టిన సర్వేలు











