డెడ్ బాడీని పోస్ట్మార్టం కూడా పంపనన్నారు!
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహిరించడంతో మూడేళ్ల తరువాత సంచలనాత్మక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే దస్తగిరి కీలక విషయాలను తన వాంగ్మూలంలో ఇవ్వగా.. సీఐ శంకరయ్య సీబీఐకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. వివేకా హత్య ఘటన పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని, డెడ్బాడీని పోస్టుమార్టం కోసం పంపవద్దని ఎంపీ అవినాశ్, శివశంకరరెడ్డి, గంగిరెడ్డి తనతో చెప్పారంటూ సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అవినాశ్, భాస్కరరెడ్డి, మనోహర్ రెడ్డి ల పర్యవేక్షణలోనే వివేకా హత్య జరిగిన స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని చెప్పుకొచ్చారు. అవినాశ్ రెడ్డి పీఏ నెంబర్ నుంచి తనకు ఫోన్ చేసి వివేకా రక్తపు వాంతులు, గుండెపోటుతో మరణించారని ఆయన వివరించారు. ఎవరు లోపలకు వెళ్లకుండా లోపల నుంచి లాక్ పెట్టుకుని రక్తపు మరకలు శుభ్రం చేయడం, కుట్లు, బ్యాండేజ్ లు వేసే వారిని మాత్రమే అనుమతించారని వివరించారు.
వివేకా డెడ్ బాడీని ఫ్రీజర్లో ఉంచారు!
వివేకా హత్యానంతరం, సాక్ష్యాలను, ఆధారాలను ధ్వంసం చేసి డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఉంచి, గాయాలు కనపడకుండా పూలతో కవర్ చేయాలని చూసారని శంకరయ్య తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది! గాయాలు ఉన్నాయని స్థానిక డీఎస్పీకి తెలియజేసిన ఐదు నిమిషాల్లోనే శివశంకర్ రెడ్డి తనకు కాల్ చేసి కోప్పడ్డారని ఆయన చెప్పారు. వివేకా శరీరంపైన గాయాలు చూసి, గుండెపోటుతో మరణించినట్లుగా అనిపించడంలేదని శివశంకర్ రెడ్డితో చెప్పగా.. నోరు మూసుకుని చెప్పింది చేయ్.. లేకుంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొవాల్సి వస్తోందని శివశంకర్ రెడ్డి హెచ్చరించినట్లు సీఐ వివరించారు. అలానే తన సిబ్బందితో మొత్తం డెడ్బాడీని వీడియో తీయమని సూచించగా.. వీడియో తీయడం ఆపేయాలంటూ శంకరరెడ్డి గట్టిగా కేకలు వేసారని సీఐ చెప్పుకోచ్చారు. మొత్తంగా వివేకా కేసు దర్యాప్తు చివరి అంకానికి చెరిందనే చెప్పవచ్చు. దస్తగిరి, సీఐ శంకరయ్య వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారాయి. అంతేకాక కేసును పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. మార్చి 15, 2019 న జరిగిన వివేకా హత్య జరిగింది. మూడేళ్ల తరువాత ఈ కేసులోని వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూడగా, హత్యలో కీలకంగా వ్యవహరించిన పాత్రదారులను సీబీఐ అరెస్ట్ చేసింది. చివరికి తెరవెనుకున్న సూత్రదారులను అరెస్ట్ చేస్తే, ఈ కేసు దర్యాప్తు క్లోజ్ అవుతోందని సీబీఐ భావిస్తోంది!
Must Read:-సీబీఐకి టీడీపీ లేఖ.. కడప జైలు సూపరింటెండెంట్ బదిలీ!











