సీజేఐగా జస్టిస్ ఎన్వీరమణ ఎంత బిజీగా ఉన్నా ఆయనకు ఓ విద్యార్ధి రాసిన లేఖకు సమాధానం ఇచ్చారు.సీజేఐగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడకు చెందిన 12వ తరగతి విద్యార్థి పొట్లూరి దర్శిత్ ఆయనను అభినందిస్తూ లేఖ రాశారు. లేఖలో ఇంత వరకు ఆయన చేసిన సేవలను పెర్కొనడంతో పాటు పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని రక్షించేందుకు చర్యలను ప్రస్తుతించారు. సీజేఐగా ఇచ్చే తీర్పులతో ఆయన కీర్తి భారతావనిపై దశదశాబ్థాలపాటు విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆనందాన్ని కలిగించిదంటూ..
ఆ లేఖపై జస్టిస్ ఎన్వీరమణ స్పందిస్తూ చక్కటి తెలుగులో, స్వదస్తూరితో రాసిన లేఖ తనకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించిదన్నారు. అతని విద్యాభ్యాసం నిరాఘాటంగా సాగాలని, ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలను అధిరోహించాలంటూ శుభాశీస్సులు తెలిపారు. ఎంత బిజీగా ఉన్నాసీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ఓ విద్యార్థి రాసిన లేఖను చదివి సమాధానం పంపడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.
Must Read ;- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నెలలో నాలుగు విలక్షణ తీర్పులు