సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ సర్కారు వారి పాట. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అందరి కంటే ముందుగా మహేషే సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో రాజమౌళి కోసం మహేష్ సర్కారు వారి పాట మూవీ విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాను 2022 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.
అయితే.. ఇప్పుడు మహేష్ బాబుతో పోటీకి విజయ్ దేవరకొండ సై అంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదేంటి.. మహేష్, విజయ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అలాంటిది మహేష్ తో విజయ్ ఎందుకు పోటీపడతాడు అనే అనుమానం రావచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే యూఎస్ఏ లో ప్రారంభం అవ్వడం.. బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరించడం మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో అడుగుపెట్టింది.
దీంతో ఇప్పుడు మేకర్స్ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1నే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. అదే రోజు మహేష్ సర్కారు వారి పాట కూడా రిలీజ్ కానుంది. దీంతో మహేష్ తో విజయ్ పోటీపడనున్నారని టాక్ వినిపిస్తోంది కానీ.. మహేష్ ను ఢీకొట్టడానికి విజయ్ దేవరకొండ సుముఖంగా ఉండకపోవచ్చు. అందుకే లైగర్ సినిమా కోసం 2022 మే 9వ తేదీని పరిశీలిస్తున్నారని మరో వార్త కూడా బయటకు వచ్చింది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- బాలయ్య, మహేష్ భారీ మల్టీస్టారర్ నిజమేనా?