ఆపరేషన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు నగరి ఎమ్మెల్యే రోజా చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజాకు ఫోన్ చేశారు. కేసీఆర్ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేయడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కూడా మెరుగుపడాలని రోజా ఆకాంక్షించారు.
Must Read ;- ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి : చెన్నైలో మూడు వారాలు రెస్ట్