మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ .. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘దృశ్యం 2’ మూవీ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాకి భారతీయ ప్రేక్షకుల నుంచి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరో విషయంలో కూడా మోహన్ లాల్ ఆనందానికి ఆకాశమే హద్దయింది. అది ఆయన తనయ విస్మయా మోహన్ లాల్ విషయంలో.
విస్మయ ఇటీవల ‘గ్రైన్స్ ఆఫ్ స్టార్ డస్ట్’ అనే పుస్తకం రాసింది. ఆమె స్వయంగా రాసిన కవితలు, దానికి సంబంధించి స్వయంగా గీసిన ఇలస్ట్రేషన్స్ తో ఆ పుస్తకం నిండి ఉంటుంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ .. ఆ పుస్తకం కాంప్లిమెంటరీ కాపీని.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు పంపారు. ఆ పుస్తకం చదివిన అమితాబ్ బచ్చన్.. నాకు ఎంతో ఇష్టమైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె గ్రెయిన్స్ ఆఫ్ స్టార్ డస్ట్ అనే పుస్తకం రాసింది. అందులో ఆమె కవితలు, ఇలస్ట్రేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా సృజనాత్మకంగా ఆమె రచించిన ఈ పుస్తకం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెకు ఆ టాలెంట్ వారసత్వంగా తండ్రి నుంచే సంక్రమించింది అని ప్రశంసలు కురిపించారు.
దాంతో మోహన్ లాల్ చాలా పొంగిపోతున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసకు తనకు మాటలు చాలడం లేదని .. ఒక తండ్రిగా తాను గర్వపడే సందర్భమిదని .. అమితాబ్ ప్రశంసను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసి అమితాబ్ పై తన గౌరవాన్ని చాటుకున్నారు.
Must Read ;- ‘దృశ్యం 3’ కి ఆస్కారముందా?
Words of appreciation coming from a legend is the best compliment and blessing Maya can get ! As for me this is the proudest moment as a father. Thank you @SrBachchan Sir. https://t.co/RdTtZmRGLr
— Mohanlal (@Mohanlal) February 23, 2021
'Grains of Stardust'
#MayaMohanlal #grainsofstardust #art #poetry pic.twitter.com/eLihxhKLCu— Mohanlal (@Mohanlal) February 23, 2021