కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికినీ బీజేపీలో చేరేందుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో చేరడానికి మధ్య ఉన్న ఈ గ్యాప్లో యువకులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన కనబడుతున్నారు. బీజేపీలో కొండా చేరుతున్నట్లు అనధికారికంగా టైం ఫిక్స్ అయినట్లు వినికిడి. అయితే అధికారికంగా జాయిన్ అయ్యేందుకు ఇంకా కొంత సమయం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల తరువాత ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ జేపీ నడ్డా, అమిత్షా సమక్షంలో జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చాలా రోజుల తరువాత దొరికిన ఈ ఫ్రీ టైమ్ను హాలిడేస్ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన మూసీ నదిలో బోటు షికారు చేసినట్లు తెలిసింది. ఆయనతో పాటు కొంత మంది యువకులు సైతం బోటు షికారులో పాల్గొన్నారు. ఈ బోటు షికారుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఆయన ట్విట్టర్లో సోమవారం పోస్ట్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో గత కొన్ని రోజులుగా బిజీబిజీగా గడిపానని అందుకే ఫన్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నానని కొండా విశ్వేశ్వర రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లోనూ ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటానని తెలిపారు. కొందరు యువకులతో ఆయన కలిసి చేవెళ్ల నియోజకవర్గంలో మూసీ నదిలో బోటు షికారులో ఎంజాయ్ చేసిన ఫోటోలను, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
అయితే బోటు షికారు చేసిన కొండా వీడియోలను చూస్తున్న నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు, సలహాలు ఇస్తున్నారు. బోటింగ్ చేసే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. అలాగే తలకు హెడ్ గేర్ లేకుండా బోటింగ్ చేయకూడదని పలువురు సూచించారు.
Must Read ;- సర్జికల్ స్ట్రైక్ నుంచి ‘సమాధులకు’ చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయం!
Some of the fun parts in this video. pic.twitter.com/r10TD9XGGD
— Konda Vishweshwar Reddy (@KVishReddy) December 8, 2020