నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో సరికొత్త కథతో రూపొందుతున్న దీన్ని ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర రాయ్ అనే కోల్ కత్తా నివాసి అని వార్తలొస్తున్నాయి. ఇటీవల నానీ కోల్ కత్తా కేరక్టర్ కు సంబంధించిన లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా నడుస్తున్న కారణంగా.. ఈ సినిమాలోని కోల్ కత్తా సీన్స్ ను.. హైద్రాబాద్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో వేసిన సెట్స్ లో చిత్రీకరించబోతున్నారట. ఫైనల్ షెడ్యూల్ ఇక్కడే చిత్రీ కరించ బోతున్నారట. అంతేకాదు సినిమాకి హైలైట్ కాబోతున్న క్లైమాక్స్ సీన్స్ కూడా ఇదే సెట్స్ లో షూట్ చేస్తారట. దీనికి దాదాపు రూ. 6.5కోట్లు ఖర్చు చేస్తున్నారట.
గతంలో మెగాస్టార్ చిరంజీవి గుణశేఖర్ కాంబో మూవీ చూడాలని ఉంది సినిమా కోసం తోట తరణి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో నిర్మించిన కోల్ కత్తా సెట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి నానీ సినిమా కోసం మళ్ళీ హైద్రాబాద్ లో కోల్ కత్తా సెట్ నిర్మిస్తుండడం విశేషాన్ని సంతరించుకుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సత్యదేవ్ జంగా కథను సమకూర్చారు. జిషు సేన్ గుప్తా విలన్ గా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా నానీకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ‘టక్ జగదీష్’ ట్రైలర్ విడుదలయ్యేది అప్పుడే !











