సరికొత్తగా తెరకెక్కించ గలిగిన సస్పెన్స్ కథా చిత్రాలు ఎప్పుదొచ్చినా ట్రెండ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు పట్టం కడుతూనే ఉన్నారు. ఇప్పడు అదేకోణంలో నవ్య పంథాలో `ప్రత్యర్థి“ చిత్రాన్ని మలచబోతున్నట్లు యూనిట్ స్పష్టం చేసింది. రవి వర్మ , వంశీ, రోహిత్ బెహల్, అక్షిత సొనవనే ప్రధాన పాత్రధారులుగా శంకర్ ముడావత్ దర్శకత్వంలో డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంజయ్ షా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో శనివారం ప్రారంభమైంది. ముగ్గురు ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ముఖ్యఅతిధి మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, టైటిల్ తగ్గట్లుగానే కథను కూడా చాలా బాగా తయారు చేసుకున్నారు. ఆసక్తి కరంగా వుండే ఈ కథను దర్శకుడు ఎంతో బాగా మలుస్తారన్న నమ్మకం వుంది. వ్యాపార విలువలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని అందించేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని కోరుకుంటున్నా .దీని తర్వాత నిర్మాత సంజయ్ షా సంఖ్యాపరంగా ఇంకా ఎన్నో చిత్రాలు తీయాలని ఆశిస్తున్నా అని అన్నారు.
చిత్ర నిర్మాత సంజయ్ షా మాట్లాడుతూ… బాలీవుడ్ లో కొంతమంది స్నేహితులతో కలిసి కొన్ని సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ చిత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. మా టీం అంతా మంచి హిట్ సినిమా తియ్యలనే కసితో వర్క్ చేస్తున్నారు. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.. అన్నారు.
దర్శకుడు శంకర్ ముడావత్ మాట్లాడుతూ., “పరిశోధనాత్మక స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందే చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం రోజు నుంచే మొదలు పెడుతున్నాం వచ్చే నెల 20 నుంచి జనవరి నెలాఖరు వరకు జరిగే మరో షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది“.అని . అన్నారు.
Also Read ;- అతిథి దెయ్యమోభవ అని చెప్పబోతున్నారా?
నటుడు రవి వర్మ మాట్లాడుతూ..ఈ చిత్రం స్క్రిప్ట్ నాకెంతో బాగా . సినిమా ప్రారంభం నుంచి ;చివరి వరకు అనేక ట్విస్టులతో ఆసక్తికరంగా ఉంటుంది. సంజయ్ షా కొన్ని మంచి హిందీ సినిమాలు నిర్మించారు“ అని అన్నారు.
హీరోయిన్ అక్షిత సొనవనే మాట్లాడుతూ, తెలుగులో నేను చేస్తున్న తొలి చిత్రమిది అని పేర్కొనగా, నటించేందుకు ఎంతో అవకాశం ఉన్న పాత్ర లభించినందుకు ఎంతో అంనందంగా ఉంది. అందరికీ నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుంది“ అని వంశీ తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రాకేష్ గౌడ్ మైసతో పాటు పలువురు చిత్రబృందం పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని బీమ్స్ సేసిరోలియో, సినెమాటోగ్రఫీని రాకేష్ గౌడ్ మైస అందిస్తున్నారు.
Must Read ;- తెలుగులో మరో ఆఫర్ దక్కించుకున్న కన్నుకొట్టుడు సుందరి