ఓ హైదాబాద్ అమ్మాయి రెండు బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ కావడం మామూలు విషయం కాదు. ఆమె పేరు అమ్రిన్ ఖురేషి. సికింద్రాబాద్ లోని శివశివాని పబ్లిక్ స్కూల్లో ఆమె చదువుకుంది. ఆమెకు ఈ అవకాశాలు ఎలా వచ్చాయి? ఆ చిత్రాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. తెలుగులో విజయవంతమైన ‘సినిమా చూపిస్త మావా’, ‘జులాయి’ రీమేక్ గా హిందీలో ఈ చిత్రాలుగా రూపొందుతున్నాయి. ప్రస్తుతం ఈమెకు తెలుగు, తమిళ చిత్రాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈమె తెలుగులోనూ నటించే అవకాశం ఉంది.
సాధారణంగా పరభాషల నుంచి తెలుగు పరిశ్రమకు హీరోయిన్లు వస్తుంటారు. అలాంటిది ఇక్కడి అమ్మాయి అక్కడికి వెళ్లడం ఓ విశేషం. ఈమె వివరాల్లోకి వెళితే ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ దర్శకనిర్మాత సాజిద్ ఖురేషి కుమార్తె ఈమె. రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎం.ఐ. ఖురేషి మనవరాలు కూడా. సినిమా చూపిస్త మావా చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ‘బ్యాడ్ బోయ్’లో ఆమె నటిస్తోంది. దీనికి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్ పై సాజిద్ ఖురేష్ దీన్ని నిర్మిస్తున్నారు.
వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదలవుతుంది. ఇక ‘జులాయి’ కి రీమేక్ గా రూపొందే చిత్రం వచ్చే జనవరిలో ప్రారంభమవుతుంది. దీనికి టోని డిసౌజా దర్శకత్వం వహిస్తారు. బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి కుమారుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నాడు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి కూడా ఈమెలో కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాల మీదనే అమ్రిన్ ఖురేషి దృష్టి పెట్టింది.
Must Read ;- అఫీషియల్ : అమితాబ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్