‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో సంచలనం రేపాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా విజయ్ దేవరకొండ కు మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే సినిమా హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో సైతం సందీప్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ క్రెడిట్ తోనే ఇప్పుడు రణబీర్ కపూర్ ‘యానిమల్’ అనే మూవీ తెరకెక్కించే అవకాశం అందిపుచ్చుకున్నాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. తన దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు ఒక స్టోరీ ఉందని చెప్పాడు. త్వరలో చిరుకి స్టోరీ నెరేట్ చేస్తానని కూడా చెప్పాడు. తాజా సమాచారం ప్రకారం రీసెంట్ గా సందీప్ రెడ్డి చిరంజీవికి ఒక అదిరిపోయే స్టోరీ నెరేట్ చేశాడని.. దానికి బాగా ఇంప్రెస్ అయిన ఆయన సినిమా చేయడానికి అంగీకరించారని టాక్.
మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమాకి సంబంధించిన హడావిడిలో ఉన్నారు. అలాగే..ఆయన తదుపరి చిత్రాలకు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సందీప్ రెడ్డి సైతం రణబీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ తీసే బిజీలో ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ కాగానే.. సందీప్ రెడ్డి తెలుగులో చేయబోయే సినిమా చిరంజీవితోనే అని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో సందీప్ .. చిరుతో ఏ తరహా చిత్రం తీస్తాడో చూడాలి.











