ఏపీలో ఆక్సిజన్, మందుల కొరత ఉన్న నేపథ్యంలో పవన్ కల్యాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా, ఆక్సిజన్, ఔషధాల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం ఎందుకింత నిర్లిప్తత అని ప్రశ్నించారు. ‘కరోనా మృతుల లెక్కలు దాచగలరేమోకానీ, బాధిత కుటుంబాల కన్నీటిని అడ్డుకోలగరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిడిసివర్ ఒక్కో ఇంజక్షన్ను రూ.40వేలకు అమ్ముతుంటే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోగలరు అని అన్నారు. ఇంటర్నెట్, మేకలు మాత్రమే కాదు. కరోనా నుంచి రక్షించే ఔషధాలు, ఆక్సిజన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కేసుల పెరుగుతుంటే, మరోవైపు పరీక్షలు ఏంటనీ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ రెడ్డి వెంటనే రాష్ర్ట సమస్యలపై ఫోకస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- విజయనగరం మహారాజా ఆసుపత్రిలో విషాదం.. ఆక్సిజన్ అందక 12 మంది మృతి?










