దేశవ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. మంగళవారం నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్గేట్లు దాటాలంటే.. ఫాస్టాగ్ తప్పనిసరి. ఒకవేళ ఫాస్టాగ్ లేకుంటే.. రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే. పైగా.. 24 గంటల్లోనే తిరుగు ప్రయాణమైతే ఇచ్చే సగం రాయితీ కూడా లభించదు. ఉదాహరణకు రూ.100 టోల్ టాక్స్ ఉంటే.. 24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యే వారికి ఫాస్టాగ్తో రానుపోను మొత్తం రూ. 150తో సరిపోతుంది. అదే ఫాస్టాగ్ లేని వాహనాలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ ప్లాజాల వద్ద మంగళవారం నుంచి అన్నీ ఫాస్టాగ్ లేన్లే ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలోని జాతీయ రహదారులపై 21 టోల్ప్లాజాలు ఉన్నాయి. ఫాస్టాగ్ గడువును ఇక పొడిగించేది లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం నాగ్పూర్లో స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇక అవకాశాలివ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. టోల్ప్లాజాల్లో ఇప్పటికే 90 శాతం వసూళ్లు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయని, మిగతా 10 శాతం వాహనాలకు సోమవారం నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేశామని గడ్కరీ చెప్పారు.
Must Read ;- మంట పుట్టిస్తున్న పెట్రోల్.. పోటీపడుతున్న ఏపీ