కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక షాక్ నుంచి కోలుకోక ముందే మరోక షాక్ తగులుతోంది. దివంగత కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న విక్రమ్ గౌడ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిసినట్లుగా తెలిసింది.
గోషామహాల్లోని పలు డివిజన్ల టిక్కెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. దీంతో ఆయన వర్గం వారిలో అసంతృప్తి నెలకొంది. తన వర్గం వారికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అఫ్జల్గంజ్లోని ఓ ఇంట్లో కాంగ్రెస్ యువ నేత విక్రమ్ గౌడ్.. డీకే అరుణతో భేటీ అయినట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం సమక్షంలో రేపు లేదా ఎల్లుండి విక్రమ్ గౌడ్ బీజేపీ కండువా కప్పుకునే అవకాశం కనబడుతోంది. గోషామహాల్ నియోజకవర్గంలో మిగిలిన 5 డివిజన్లలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Must Read ;- ఆత్మవంచన వీడకుంటే.. అథోగతి తప్పదు రేవంత్రెడ్డి సార్!