అయోధ్యలో బాబ్రీ మసీదుకు బదులుగా నిర్మించనున్న నూతన మసీదు భవనానికి నేడు పునాది రాయి పడునుంది. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ అయ్యాక.. మత సామరస్యానికి చిహ్నంగా ఉండేలా ఈ మసీదుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ మసీదు డిజైన్ ఫైనల్ అయింది. అయోధ్యలో వివాదాస్పద స్థలమైన రామజన్మ భూమిపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రామాలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తీర్పు తరువాత యూపీ ప్రభుత్వం అయోధ్యకు దగ్గరలోని సోహవెల్ తహసీల్ పరిధిలోని దన్నీపూర్ -రౌనాహీ ప్రాంతంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. దీనిపై చర్చోపచర్చల అనంతరం వక్ఫ్ బోర్డు, మత పెద్దలు ఆ భూమి తీసుకునేందుకు అంగీకరించారు.
మసీదు నిర్మాణానికి కార్యాచరణ
అప్పటి నుంచి ఇక్కడ మసీదు నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఏడు దశాబ్ధాల క్రితం జవనరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అందుకే జనవరి 26వ తేదీన మసీదుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(IICF) కార్యదర్శి అథర్ హుస్సేన్ గతంలో ప్రకటిచాంరు. ఈ మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డు ఆరు నెలల క్రితం IICFని ఏర్పాటు చేసింది.
ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఎస్ ఎం అక్తర్ రూపుదిద్దిన డిజైన్ బ్లూప్రింట్ కు ఆమోదం తెలిపిన IICF ఈ మసీదును 1857 మొదటి స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, యోధుడు అహ్మదుల్లా షాకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆసుపత్రులు, లైబ్రరీ..
ఈ మసీదును మత సామరస్యానికి ప్రతీకగా నిర్మించనున్నారు. అందులో భాగంగా పబ్లిక్ లైబ్రరీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఉచిత భోజనశాల కూడా ఉన్నాయి. వలయాకారంలో నిర్మించే ఈ మసీదులో ఒకేసారి 2వేల మంది ప్రార్థనలు చేసుకునే విధంగా నిర్మించనున్నారు. 300 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణం కానుంది. మొత్తం మీద చూస్తే.. బాబ్రీ మసీదు కంటే పెద్దదిగా నిర్మితం అవుతుందని IICF కార్యదర్శులు అక్తర్, అతార్ హుస్సేన్లు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం నిర్మితం అవుతున్న రామాలయానికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ మసీదు కూడా ఉండటం. తద్వారా పర్యాటకులు రెండింటినీ తక్కువ సమయంలోనే చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక అన్ని రకాల భూసార పరీక్షలు నిర్వహించామని, అన్నివర్గాల వారికి సహాయం అందించేలా ప్రవక్త ప్రబోధనలకు అనుగుణంగా నిర్మాణం జరుగుతుందని, ఇండో-ఇస్లామిక్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాంమని హుస్సేన్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు మసీదుల డిజైన్లను పరిశీలించిన అనంతరం ఈ మసీదుకు కొత్త డిజైన్ ఖరారు చేశారు.
ఇక అయోధ్యలో రామాలయ నిర్మాణం మొదలైన విషయం తెలిసిందే. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. దాదాపు రూ.వెయ్యికోట్ల విరాళాలతోనే ఈ నిర్మాణం జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. విరాళాల సేకరణ ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ను మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే రూ.వందకోట్లు దాటినట్టు ట్రస్ట్ ప్రకటించింది. ఈ రెండు నిర్మాణాలూ పూర్తయితే.. మత సామరస్యానికి చిహ్మాలుగా మారనున్నాయి.
Must Read ;- నెలరోజుల్లోగా కొత్త కోదండరామాలయం నిర్మాణం











