పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో సీతగా ఎవరు నటిస్తారు.? రావణుడుగా ఎవరు నటిస్తారు.? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణుడుగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటించనున్నారు.
రావణుడుగా సైఫ్ ని ఎంపిక చేయడం పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇక లక్ష్మణుడు పాత్రను ఎవరు పోషిస్తారంటే.. కోలీవుడ్ నుంచి యంగ్ హీరోను ఎంపిక చేయనున్నట్టు టాక్ వినిపించింది. అయితే.. కోలీవుడ్ హీరోలతో సెట్ కాలేదో ఏమో కానీ.. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో పేరు తెర పైకి వచ్చింది. ఇంతకీ ఎవరంటే.. టైగర్ ష్రాఫ్. అవును.. టైగర్ ఫ్రాఫ్ ను లక్ష్మణుడు పాత్రకు ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది. ఇటీవలే ఈ భారీ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు 500 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ ఇది. మరి.. ఈ సంచలన చిత్రంతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Must Read ;- ప్రభాస్ ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ బయటపెట్టిన నాగ్ అశ్విన్