తిరుపతి శేషాచలనగర్లో శ్రీనివాస్ అనే మృతుని ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.శ్రీనివాస్ ఇంట్లో నోట్ల కట్టలు చూసి టీటీడీ విజిలెన్స్ అధికారులు షాక్కు గురయ్యారు. అసలు విషయం ఏమిటంటే… పదేళ్ల కిందట తిరుమలలో గుడిసెలు ఖాళీ చేయించినప్పుడు అవివాహితుడైన శ్రీనివాస్కు తిరుమల తిరుపతి దేవస్థానం శేషాచలనగర్లో ఇల్లు నిర్మించి ఇచ్చింది.అతనికి బంధువులు కూడా ఎవరూ లేరు.ప్రతి రోజూ శ్రీనివాస్ శేషాచలనగర్ నుంచి తిరుమలకు చేరుకుని అక్కడికి వచ్చే భక్తులకు తిరునామాలు దిద్దుతూ వారిచ్చిన డబ్బు తీసుకుంటూ కాలం వెళ్లదీశేవాడు.ఇలా పోగేసిన డబ్బు కట్టలుగా కట్టి ఇంట్లో గోతంలో పెట్టాడు.గత ఏడాది శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోయాడు.అతనికి అయినవారు ఎవరూ లేరని తెలసుకున్నటీడీపీ విజిలెన్స్ అధికారులు ఇవాళ శ్రీనివాస్ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు శేషాచలనగర్లో అతని ఇంటికి చేరుకున్నారు.తాళం వేసి ఉండటంతో దాన్ని పగుల కొట్టించి, ఇంట్లోకి ప్రవేశించారు.ఇంట్లో వందలు, 500, 2000 నోట్ల కట్టలు చూసి విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు.
విచారిస్తున్నాం..
తిరుమలలో తిరునామాలు దిద్దే శ్రీనివాస్కు ఇంత డబ్బు ఎలా వచ్చిందనే దానిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.శ్రీనివాస్ ఇంట్లో దొరికిన డబ్బును స్వాధీనం చేసుకుని లెక్కించే పనిలో పడ్డారు.తిరునామాలు దిద్దే శ్రీనివాస్ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.
Must Read ;- తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం : టీటీడీ అధికారిక ప్రకటన











