అభిమానం,రాజకీయం వేర్వేరని తెలియదా??
సినిమా మానసిక ఉల్లాసానికి, ఆనందానికే కాదు.. తనను తాను అభిమాన హీరోతో కంపెరీజన్ చేసుకుని కేరియర్ ను బిల్డ్ చేసుకునేందుకు కూడా దోహదపడుతోంది. ఇదిలా ఉంటే సినిమాలు, అభిమాన హీరో వేరు.. రాజకీయాలు వేరు. అన్న ఎన్టీఆర్, ఎంజీర్ కు తప్ప, చిత్ర సీమ నుంచి వచ్చిన ఏ నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో మనగల్గడం అన్నది కష్టసాధ్యమే! అందుకే ప్రస్తుత మారిన రాజకీయాల్లో సినిమా, రాజకీయం తెలుగునాట క్వైట్ ఆపోజిట్ గా మారాయి! అది మెగాస్టార్ ప్రజారాజ్యంతోనే రుజువైంది. ఆ తర్వాత పవన్ విషయంలో కూడా తేటతెల్లమైంది. అయినా జగన్ రెడ్డికి పవన్ విషయంలో భయం వీడలేదనుకుంటా.. అందుకే టికెట్ ధరలపై వేసిన కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇస్తానన్న జీవోను విడుదల చేయలేదు. కేవలం పవన్ సినిమా కోసం ఆ జీవోను తొక్కిపట్టారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జగన్, ఆయన మంత్రులు వినోదం చూస్తున్నారు. పవన్ కు ఏపీలో కోట్ల మంది అభిమానులున్నారు. కానీ అభిమానం 2019లో ఓటు బ్యాంకుగా మారలేదు. ఒక్క అవకాశం వైపు మరలి.. నేడు లెంపలేసుకుంటున్నారు. ఇవన్నీ ఆయన పక్కనున్న రాజకీయకోవిదులకు తెలియనివి కావు. అన్ని తెలిసి, పవన్ అభిమానుల సెంటిమెంట్ పై కొట్టారు. దాని పర్యావసనం జగన్ రెడ్డి పార్టీకి దెబ్బ పడక మానదు అన్న విమర్శలు లేకపోలేదు!
బ్లాక్ దందాపై రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు నిరసన!
‘భీమ్లానాయక్’ శుక్రవారం ఏపీ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైంది. విడుదలకు వారం ముందు నుంచి భ్లీమానాయక్ సినిమా కు కలర్ ఫుల్ రాజకీయ రంగు పులిమారు వైసీపీ నేతలు. టికెట్ ధరలపై అంక్షాలు పెట్టారు. బెనిఫిట్ షో వేస్తే థియేటర్లును క్లోజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం రంగంలోకి దిగి.. థియేటర్ల యాజమాన్యంపై కట్టుదిట్టమైన నిఘా ఉంది.. అధిక థరలకు టికెట్లు అమ్మితే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ లు పై వార్నింగ్ లిచ్చారు. జీవో నెంబర్ 35 ప్రకారమే టికెట్స్ అమ్మకాలు జరపాలని హుకూం జారీ చేశారు. చివరికి రూ.70 టికెట్ కాస్తా బ్లాక్ లో రూ.300 నుంచి 500 అయింది. ఇలా అంక్షలయితే కక్షసాధింపు చర్యలుగా విధించారే తప్ప.. బ్లాక్ టికెట్ అమ్మకాలు జోరును మాత్రం కంట్రోల్ చేయడం మరిచారు. రాష్ట్రంలో నేడు ఈ బ్లాక్ టికెట్ దందాకు కీ – రోల్ పోషిస్తుంది ఎవరో.. అధికార పార్టీ, స్థానిక పోలీసులకే తెలియాలి. పవన్ పై ఉన్న కోపం.. నిన్ను అభిమానించి, నీకు ఒక్కఛాన్స్ ఇచ్చిన థియేటర్ల యాజమాన్యాలు, వాటిపై ఆధారపడి జీవించే కుటుంబాలు, సగటు అభిమానులపై జగన్ ఆక్రోసం వెల్లగక్కడం దారుణం. కనీసం వారు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను, సెంటిమెంట్స్ ను గుర్తించకుండా.. అధికార మదంతో వారి జేబులకు చిల్లులు పెట్టాలని చూడడమేంటి? అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటువంటి దారుణాలకు వడిగట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అధికార వైసీపీ పెద్దలను అభిమాన సంఘాలు ఎలా క్షమిస్తాయంటూ సోషల్ మీడియా ట్రోల్స్ మొదలయ్యాయి. మరోవైపు 13 జిల్లాలో పవన్ అభిమానులు థియేటర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో లేకుండా చేయటమే కాకుండా.. బ్లాక్ మార్కెట్లో టికెట్ ధరలను అమాంతం పెంచేసి దోచుకుంటున్నారని అభిమానుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పవన్ పై కక్షసాధింపు విషయం దేవుడెరుగును కానీ, వైసీపీ పన్నిన కుయుక్తులు మాత్రం అటర్ ప్లాప్ అయ్యాయి! అంతిమంగా అహంకారానికి – ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో పవన్ గెలిచాడనే సోషల్ మీడియా ఉదయం నుంచి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు!
Must Read:-మత్స్యకారుల కోసం ప్రాణాలర్పిస్తా..! హక్కుల కోసం ఉద్యమిద్దాం! జీవో 217ను చించేసిన పవన్!!











