నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జాతిరత్నాలు’. అనుదీప్ కెవీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించారు. అతితక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి అత్యధికంగా లాభాలొచ్చి పడ్డాయి. అలాగే.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమాకి అత్యధిక ఆదరణ దక్కుతోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ‘జాతిరత్నాలు’ మూవీ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ రూపొందుతుందని వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ కథ అమెరికా నేపథ్యంలో సాగుతుందట. జాతిరత్నాలు ముగ్గురూ బాగా డబ్బు సంపాదించే ఉద్దేశంలో అమెరికాకి ప్రయాణం అవుతారట. ఈ ప్రోసెస్ లో ఈ ముగ్గురూ ఓ క్రైమ్ లో చిక్కుకుంటారట. చివరికి దాన్ని నుంచి ఎలా తప్పించుకుంటారు అనేదే ఈ సినిమా కథాంశమని తెలుస్తోంది. మొదటి భాగంలో కథానాయికగా నటించిన ఫరియా అబ్దుల్లా రెండో భాగంలోనూ నటిస్తుందని సమాచారం. అతి త్వరలో ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.
Must Read ;- రూ. 5 కోట్ల ధర పలుకుతోన్న జాతిరత్నం