బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య కొద్ది కాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ దశమి సందర్భంగా కంగనా మరోసారి శివసేనను టార్గెట్ చేసి తన మాటల ఈటెలను ప్రయోగించారు.
ముంబయిలోని కంగనా ఆఫీస్ ను పువ్వులతో అలంకరించిన చిత్రాలను కంగనా తన ట్విటర్ ఖాతాలో ఉంచి తన అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా మరోసారి శివసేన మీద సంజయ్ రౌత్ మీద తన మాటల అస్త్రాలను సంధించారు. ‘పప్పు సేన తన ఇంటిని కూల్చేయగలదేమో కానీ..తన స్పిరిట్ ను కూల్చేయలేరు. చెడు పై మంచి విజయాన్ని బంగ్లా నెంబర్ 5 (కంగనా ఆఫీస్ భవనం) సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
శివసేన విషయంలో కంగనా ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని ఆమె అభిమానులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చేసిన ట్విట్ చర్చానీయాంశమైంది. అటు సుశాంత్ అభిమానులు కూడా కంగనాకు మద్దతు తెలుపుతున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు, శివసేన నేతలపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణానికి కారణమైన అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కంగనా, శివసేన నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
My broken dream smiling in your face Sanjay Raut, Pappu sena could break my house but not my spirit, Banglow number 5 is celebrating the triumph of good over evil today #HappyDussehra pic.twitter.com/2i4OnxiPeS
— Kangana Ranaut (@KanganaTeam) October 25, 2020











