ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి, కొత్తగా సృష్టించి మరీ తీసుకున్న గ్రామ వాలంటీర్లు.. లంచగొండులని ఆమె ఆరోపించారు. చాలా మంది వాలంటీర్లు.. ప్రజలకిచ్చే పెన్షన్ డబ్బులో కమీషన్లు కొట్టేస్తున్నారని, ఈ విషయం తెలిసి కూడా సీఎం జగన్ వారిని కాపాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వారి కోసం జగన్ ఇంత చేస్తున్నా.. వారికి అర్థం కావడం లేదని, ఈ రోజు ప్రభుత్వం పైనే వారు తిరగబడుతున్నారని తిట్టిపోశారు. ‘సాక్షి’ చానల్ లో గురువారం ఉదయం జరిగిన చర్చా కార్యక్రమంలో లక్ష్మీపార్వతి ఈ వ్యాఖ్యలు చేశారు.
అవినీతిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా..
కాగా, లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అవినీతి పరులను శిక్షించాల్సిన ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహించడం దేనికి సంకేతమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేయాలిగానీ.. అవినీతిపరుల కోసం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. వాలంటీర్లు.. ప్రజలను వేధిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై విచారణ జరిపించి, నిజానిజాల నిగ్గు తేల్చాలన్న డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. వాలంటీర్లు అవినీతికి పాల్పడి ఉంటే.. అప్పుడే వాళ్లపై చర్యలు తీసుకోవాలి గానీ.. ఇప్పుడు వాళ్లు జీతాలు పెంచమన్నప్పుడు విషం కక్కడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు.
Must Read ;- సీఎం లేఖతో అయోమయంలో వాలంటీర్లు











