ఇటీవల మెగా డాటర్ నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన చైతన్యచేత మూడు ముళ్ళు వేయించుకుంది. ఆ విహహం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మెగా హీరోలందరూ ఒక వేదికపైకి వచ్చి సందడి చేశారు. ఈ వేడుకను ఇంతలా గ్రాండ్ గా జరగడానికి ముఖ్య కారణం నాగబాబు భార్య పద్మజ. కూతురు పెళ్లంటే తల్లిదండ్రులకు మరిచిపోలేని ఒక తీయని అనుభూతి. ఆమె తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపడానికి చాలానే కష్టపడ్డారు అనే చెప్పాలి.

ఆవిడ .. కొడుకు వరుణ్ తేజ్ తో కలిసి తన కూతురు నిహారికకు సంబంధించిన ప్రతీ విషయాన్ని దగ్గర ఉంది చూసుకున్నారు అని తెలుస్తోంది. వారిద్దరూ కలిసి నాగబాబుకు ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకుండా దగ్గర ఉండి అన్ని పనులు చూసుకున్నారు. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా తెలియజేశారు. నిహారిక వివాహ వేడుక ఇంత గ్రాండ్ గా జరిగింది అంటే దానికి తన భార్య పద్మజయే ముఖ్య కారణం అని అన్నారు. కూతురు వివాహం అంటే ప్రతీ తండ్రికి చాలా కష్టమైన పని, తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు పెళ్లిని అందరికి గుర్తుండిపోయేలా జరపాలని చూస్తారని, నేను కూడా అలాగే ఆలోచించానని తెలిపారు నాగబాబు. వివాహ వేడుక కోసం అందరూ గొప్పగా చెప్పుకోవాలని, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాము అని అన్నారు.
ఈ విషయంలో నా భార్య పద్మజకు అభినందనలు తెలపాలని అన్నారు నాగబాబు. పద్మజ ఈ బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకొని నా ఈ ప్రయాణాన్ని సుగమం చేసిందని ఎమోషనల్ అయ్యారు నాగబాబు. ఇక నిహారిక వివాహం జరిగిన తీరు మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రజలను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Must Read ;- రిసెప్షన్ వేడుకలో యువరాణిలా మెరిసిన మెగా డాటర్ నిహారిక
https://www.youtube.com/watch?v=V4jpEsGOn_I











