ఛార్మింగ్ గాళ్ ఛార్మి.. నీ తోడు కావాలి, శ్రీ అంజనేయం, గౌరి, మాస్, చక్రం, అనుకోకుండా ఓ రోజు.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ మధ్య ఛార్మి జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి వరసగా సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఛార్మి.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్గా సౌత్ అండ్ నార్త్లో మంచి క్రేజ్ ఉన్న దేవీశ్రీప్రసాద్ అప్పుడప్పుడు స్క్రీన్ మీద హుషారుగా సందడి చేస్తుంటాడు. ఆయనలో హీరో కళ బాగానే కనిపిస్తుంది. అందుకే గతంలో ఈయన హీరోగా సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. సుకుమార్ డైరెక్షన్ లో దేవిశ్రీ హీరోగా చేసే సినిమాను దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ అప్పట్లో ఈ వార్త పై స్పందిస్తూ.. ఆలోచన అయితే ఉంది. ఎప్పుడు జరుగుతుందో చూడాలి అన్నారు.
ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ న్యూస్ వచ్చింది. అయితే… ఇప్పుడు ఛార్మి నిర్మాతగా వరసగా సినిమాలు నిర్మిస్తుండడంతో దేవిశ్రీప్రసాద్ తో సినిమా చేయడం నిజమేనేమో అనుకుంటున్నారు. అయితే.. ఈ విషయంలో చార్మిగాని, దేవీశ్రీ గానీ ఇంకా స్పందించలేదు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై ఛార్మి కానీ దేవిశ్రీ కానీ స్పందిస్తారేమో చూడాలి.