వైసీపీ మీడియా ఛానల్ సా*క్షిలో అమరావతిపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అమరావతి వే*శ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. దీంతో కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఐతే వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించకపోగా.. సిగ్గులేకుండా సమర్థించారు. అంతేకాదు.. సజ్జల సైతం రాజధాని ప్రాంత మహిళలపై విషం కక్కారు.
కొమ్మినేని అరెస్ట్పై స్పందించాల్సిన సజ్జల అమరావతి మహిళల మీద మరింతగా నోరు పారేసుకున్నారు. జగన్ అమరావతి మహిళలను అవమానిస్తారా, ఆయన ఛానెల్ ఆ పని చేస్తుందా అంటూ ప్రశ్నించిన సజ్జల.. సా*క్షికి, జగన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసిన అమరావతి మహిళలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లు పిశాచాలు, రాక్షసులు, అంతకుమించిన సంకర జాతి అంటూ తీవ్రంగా దూషించారు. వారిలో పైశాచికత్వం కమ్ముకుందని.. అందుకే జగన్ ఫొటోలను చెప్పులతో కొట్టడం లాంటివి చేశారని.. వీళ్లందరూ ఆర్గనైజ్డ్గా వైసీపీ మీద, జగన్ మీద విషం కక్కుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సజ్జల చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారయ్యాయి.
సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష అని లోకేష్ ప్రశ్నించారు. ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సా*క్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారని, ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారని లోకేష్ ఆక్షేపించారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు లోకేష్.











