రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నాయకులు హాజరు కాలేదు. కాంగ్రెస్లో టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్కి వ్యతిరేకంగా చాలామంది నాయకులు వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ సభకు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకాక పోవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా రేవంత్రెడ్డి రావిరాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కొందరు నాయకులు మాత్రమే హాజరయ్యారు. అధిష్టానం సూచనలను, ఆదేశాలను రేవంత్ భేఖాతరు చేయడంతో పాటు సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్న కారణంతో ఈ సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తొంది.
చాలా మంది నాయకులు హాజరు
ఇక రేవంత్రెడ్డి సభకు చాలా మంది నాయకులు హాజరయ్యారు. దీంతో రేవంత్ వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది.ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ లీడర్లు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఇందిరా శోభన్, నర్సింహారెడ్డి , సురేష్ షట్కార్, దాసోజు శ్రవణ్ కుమార్, చిన్నారెడ్డి, కొండా సురేఖ, మల్రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మహేందర్ రెడ్డి, బలరాంనాయక్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, 14 జిల్లాల అధ్యక్షులు, తదితరులు హాజరయ్యారు. రావిరాలలో నిర్వహించిన ఈ సభా కార్యక్రమానికి.. రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో..వేదిక కుప్పకూలే ప్రమాదం ఉందని నిర్వాహకులు పదేపదే విన్నవించాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి ఠాకూర్కు సీనియర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.
పరోక్ష కౌంటర్..
కాగా ఈ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలపడం బాధ్యత అని, రైతుల సమస్యలపై మాట్లాడాలంటే..ఎవరి అనుమతి కావాలని నిర్వాహకులు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ డైరెక్ట్గా విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ..డైరెక్ట్గా వీహెచ్ని విమర్శించారు. సీనియర్లుగా చెప్పవాళ్లు పార్టీ బాగు కోసం పనిచేయాలని వ్యాఖ్యానించారు. మల్లురవి మాట్లాడుతూ ఈ సభకు ఎవరి ప్రోద్భలం లేదని, ప్రజల్లోనుంచి వచ్చిన ఆకాంక్ష అని, సభకు హాజరైన ప్రజలను చూస్తే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. కాగా ఈ మీటింగ్పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంటే.. టీఆర్ఎస్, బీజేపీలు ఎక్కువగా సమాచారం సేకరిస్తున్నాయంటే.. ఆ పార్టీల్లో ఎలాంటి భయం మొదలైందో తెలసుకోవచ్చని మల్లురవి వ్యాఖ్యానించారు. సీతక్క మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. సభకు ఇంత జనం వచ్చారంటే..వ్యతిరేకులు కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఓవైపు రేవంత్ నిర్వహించిన సభ సక్సెస్ అవయిందని రేవంత్ వర్గం చెబుతోంది.
ధిల్లీ నుంచి సమాచారం..
కాగా రేవంత్ నిర్వహిస్తున్న సభకు సంబంధించి రేవంత్ తన వైఖరి ఏంటో ధిల్లీకి ఇప్పటికే సమాచారం పంపినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం అనుమతితోనే సభలో కొన్ని తీర్మానాలకు కూడా అనుమతి లభించడం చర్చనీయాంశమైంది. పార్టీ స్టాండ్ మేరకే ఈ మేరకు ప్రకటన వచ్చిందని ఆయన వర్గం చెబుతోంది.
Must Read ;- లీడర్లకు షాక్..శ్రేణుల్లో జోష్: రేవంత్ రైతు భరోసా యాత్ర











