ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ పేరు పెట్టి, జాతికి అంకితం చేశారు. అయితే విమానాశ్రయ ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేని, వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై జనాలు, ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టుకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరు పెట్టినందున, ఆ యోధుడి విగ్రహం పెట్టి ఉంటే బాగుండేది కదా.. అని అంటున్నారు. కాగా గతంలో చంద్రబాబు హాయంలోనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు సీఎం జగన్ ఎలా ప్రారంభిస్తారని, ఎన్నిసార్లు జాతికి అంకితం చేస్తారని పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- రాత్రికి రాత్రి విశాఖకు లేచిపోవాలని జగన్ ప్లాన్.. ఎంపీ రఘురామరాజు











