ఏపీలో రక్త చరిత్ర రిపీట్ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ పెద్దల వరకూ వెళ్లే అవకాశం ఉంటే.. ఆ కేసుల్లో సాక్షులకు మూడటం ఖాయమని గతంలో జరిగిన చాలా పరిణామాలు స్పష్టం చేశాయి.. పరిటాల రవి మర్డర్ మొదలుకొని వివేకానందరెడ్డి హ*త్య కేసు వరకు అనేక మంది సాక్షులు అనూహ్యంగా మర*ణించారు. తాజాగా తిరుమల హుండీ చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి అనుమానాస్పద రీతిలో మర*ణించారు. పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరైన సతీశ్ కుమార్.. అప్రూవర్గా మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇంకేముంది వారం తిరిగే సరికి అతను రైల్వే ట్రాక్పై శ*వంగా మారాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో హుండీ ఆదాయం లెక్కించే రవికుమార్ అనే వ్యక్తి వందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీ దోచుకున్నాడు. ఈ దోపిడీపై అప్పట్లో టీటీడీ ఏవీఎస్వోగా పనిచేసిన సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. టీటీడీ పెద్దలు, అప్పటి పాలకుల నుంచి వచ్చిన ఒత్తిడితో రాజీ చేసుకున్నారు. స్వామివారి హుండీ సొమ్మును దోచుకున్న రవికుమార్తో కొంత మొత్తం దేవస్థానానికి తిరిగి ఇప్పించి కేసు క్లోజ్ చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు దేవుడిని దోచుకున్న దొంగని కూడా దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీటీడీ నుంచి కొట్టేసిన కోట్లతో రవికుమార్ తిరుపతి, చెన్నైతో పాటు అనేక ప్రాంతాల్లో ఆస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆస్తులను అప్పటి టీటీడీ పెద్దలు తమ పేరిట రాయించుకొన్నారనే వార్తలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై విచారణకు ఆదేశించింది.
పరకామణి చోరీపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. అప్పట్లో దొంగతనంపై ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ అధికారి సతీశ్ను విచారించింది. అతను అప్రూవర్గా మారతారనే సమాచారం వచ్చిందో.. లేక అనుమానమే పెనుభూతమైందో కానీ.. సీఐడీ పోలీసులతో మాట్లాడిన వారం తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర రైల్వే ట్రాక్పై శ*వంగా కనిపించాడు. సతీశ్ మర*ణాన్ని అనుమానాస్పద మృ*తిగా భావించి.. పోలీసులు విచారణ చేస్తున్నారు. వైసీపీ పెద్దలకు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చిన కేసుల్లో కీలక వ్యక్తులు లేదా సాక్షులు మర*ణించడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి కేసుల్లో అధికారులు, అనుచరులు అయితే జైలుకి లేకపోతే పైకి పోతున్నారు గానీ.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల మీద ఇప్పటి వరకు ఈగ కూడా వాలదు అనేది ప్రజలందరికీ తెలిసిన బహిరం రహస్యం..











