ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వైసీపీని ఇంటికి పంపాలి!
ఏపీ ఆరోగ్యంగా ఉండాలంటే అధికార వైసీపీని ఇంటికి పంపాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే కేంద్రం విరమించుకోవాలని జనసేన ఆధ్వర్యంలో ఆపార్టీ అధినేత పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం తప్పులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. పార్లమెంట్ లో సంఖ్య బలమున్న అధికారపార్టీ వైసీపీ గట్టిగా నినదిస్తే .. నేడు ఏపీకి ఈ పరిస్ధితి నిజంగా వచ్చిఉండేది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పరిశ్రమగానే చూస్తున్నారే తప్పా.. దానిని సాధించుకునేందకు 150 మంది చేసిన ప్రాణ త్యాగాలను ఒకసారి గుర్తుచేసుకుంటే ప్రైవేటీకరణ అంశమే తెరపైకి రాదు. దేశానికి కీలమైన పరిశ్రమ, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మకానికి పెడితే వైసీపీలా చేతులు కట్టుకుని మరి తాను కూర్చోనని దీక్షా శిబిరం నుంచి జనసేనాని ఎంతో బలంగా గళాన్ని వినిపించారు. విశాఖ హక్కును కాపాడుకోవాడానికి ఎంతదూరమైన వెళ్తానని, దానికి ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని పవన్ కోరారు.
స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం ఆగదు ..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక కులం, మతం, వర్గం యొక్క సమస్యకాదు. ఐదు కోట్ల ఆంధ్రులు ఆత్మగౌరవం! హక్కు నినాదంతో ఉక్కు సంకల్పం పూని అనేక మంది ప్రాణాలర్పించి సాధించుకుంటే .. ఇప్పుడొచ్చి ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తాం అంటే ఊరుకోవాలా? ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధినిచ్చే ఏపీ కల్పతరువును, ఆదాయ వనరును కార్పోరేట్ కు ధారదత్తం చేయాలని చూస్తూ సహించేది లేదు అన్నదే ఉక్కు పరిరక్షణ సమితి, పవన్ నినదించేది. ఇందులో రాజకీయాంశాన్ని, ప్రయోనాలను, స్వార్థాలను పక్కన పెట్టి.. కలికట్టుగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నదే పవన్ డిమాండ్ చేశారు. అలా జనసేనాని డిమాండ్స్ వినిపిస్తుంటే వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. అమరావతి నిలబడినట్లే.. స్టీల్ ప్లాంట్ కోసం పవన్ నిలబడతానన్నారు. ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి పరిస్ధతిని నివేదించామన్నారు. అధికార వైసీపీ మెడలు వంచాలంటే ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ, తక్కువ మాట్లాడితే ఎదిరించి, ఎదుర్కోవాలని జనసైనికులకు అల్టిమేటం జారీచేశారు పవన్. జనసేన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం .. దానిని కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమం సహేతుకం ..! ఆంధ్రుల ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు తన పోరాటం నిత్యం సాగిస్తునే ఉంటానని పవన్ పురుద్ఘాటించారు.
Msut Read ;- ముగింపు దశకు అమరావతి రైతులు పాదయాత్ర!కర్నాటక రైతుల భారీ విరాళం!!











