బెజవాడ దుర్గగుడి రథం వెండి సింహాల అదృశ్యం కేసులో పోలీసులు మరల దర్యాప్తు ప్రారంభించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సంచలనం సృష్టించిన వెండి సింహాల మాయం కేసులో3 ప్రత్యేక బృందాలు, 3 నెలలపాటు విస్తృతంగా గాలించినా ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో చేతులెత్తేశారు. నేడు మరల వెండి సింహాల మాయం కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థులను విచారించే క్రమంలో, వెండి సింహాల కేసు కూడా తెరపైకి వచ్చిందని తెలుస్తోంది.
వెండి సింహాల కేసును క్లోజ్ చేస్తారా?
దుర్గగుడి వెండి సింహాల నిందితులను నేటికీ గుర్తించలేకపోవడంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. దాదాపు 300 వందల మందిని విచారించినా ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. అయితే, పలు దొంగతనాల కేసుల్లో, ముఖ్యంగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడే ముఠాలను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. వెండి సింహాల అదృశ్యం కేసులో మరో నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో కదలిక వచ్చింది.
Must Read ;- సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?











