పిడుగురాళ్లలో భారీ ర్యాలీ..!
గురజాలను పల్నాడు జిల్లాగా ప్రకటించాలని వెనుకబడిన పల్నాడు ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ.. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురజాల, మాచర్ల నియోజకవర్గాల ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మౌళికంగా విస్తారమైన వనరులున్నా.. పల్నాడు శతాబ్ధాలు వెనుకబడి ఉంది! కృష్ణానది పక్కనున్న తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితులు ఈ నాటివి కావు! సరైన పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన వంటివి మచ్చుకైన కనిపించవు! సరైనా రోడ్లులేక ఇక్కడ ప్రజల జీవన పరిస్థితులు కడు దుర్భరంగా మారాయి. పేరుకు పల్నాడు జిల్లా అని.. కేంద్రాన్ని నరసరావుపేటలో పెడుతున్నట్లు ప్రకటించడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. అంతిమంగా జగన్ రెడ్డి ప్రభుత్వం పల్నాడు జిల్లా ఏర్పాటు అంశం తప్పనిసరిగా పునరాలోచించాలి! అత్యంత సున్నితాత్మకంగా మారుతున్న గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా అంశంపై దృష్టిసారించి, కేంద్రం ఏర్పాటు జరగాలన్నదే అఖిలపక్షం నేతలతో పాటు మేధావులు, విద్యార్థులు, యువత కోరుతోంది! ప్రజాభిష్టం మేరకు పల్నాడు జిల్లా ఉండాలేకానీ, రాజకీయ అవసరాలకు ఇష్టమొచ్చినట్లు విభజన చేస్తే.. మారుతున్న పరిస్థితులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానవు! ఈ నేపథ్యంలో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్లలో పల్నాడు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మహార్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మీకిష్టమొచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేస్తే.. ప్రజాస్వామ్యం ఎందుకు?
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికకాబడి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహిరిస్తే ఎలా అని తెదేపా సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. పల్నాడు జిల్లాను నరసరావుపేటలో కాకుండా గురజాలలోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 900 ఏళ్ల చరిత్ర కలిగిన పల్నాడును జిల్లాగా ప్రకటించాలన్నారు. పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడమనేది భిక్ష కాదు.. హక్కు అని ఆయన అన్నారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసే వరకూ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు యరపతినేని. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీకి పలు డిమాండ్స్ వినిపించామని, తమ డిమాండ్స్ ను పట్టింకోకుంటే భవిష్యత్తులో న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. పల్నాడు దెబ్బ రుచేమిటో తాడేపల్లి ప్యాలెస్కు కూడా చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
Must Read:-అప్పు లేనిదే పూట గడవుదు..! మరో రూ. 27 వేల కోట్ల అప్పుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం!