మో‘ఢీ’ పై అది సాధ్యమేనా?
దేశంలో బలమైన నేత, సుదీర్ఘ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభం, మొండి నిర్ణయాలను సైతం అమలుపరిచి.. దేశ ప్రయోజనాలంటూ విపక్షాలను మట్టికరిపించే వ్యూహకర్త ప్రధాని నరేంద్ర మోదీ. అటువంటి నరేంద్ర మోదీ విధానాలను, నిర్ణాయాలను, ప్రాతీయ పార్టీలపై అణిచివేత ధోరణిలను ఎండగట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. అందుకే బీజేపీయేతరులను ఒకతాటిపైకి తెస్తున్నాం అంటూ వైరి పక్షాలు నినదిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల సీఎంలతో చర్చించేందుకు ఒక ఫ్రంట్ సిద్ధమౌతోంది. దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత సారథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం వహింస్తున్నారు. ఒక చేత్తో శబ్ధం రాదన్న నినాదాన్ని విధానంగా మార్చుకుని.. దేశంలోని ప్రాంతీయ శక్తులను ఏకం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకే గుణాత్మక రాజకీయాలంటూ.. కేసీఆర్ కాలుకు బలపం కట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు సీఎం స్టాలీన్ ఇప్పటికే కలవగా.. నేడు ఉత్తరాదిన శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లను కలిసేందుకు కేసీఆర్ మహారాష్ట్ర కు పయనమయ్యారు. అలానే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో విపక్షాల మద్దతును కూడా కేసీఆర్ కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు.
మరాఠ నేతలో కీలక భేటీ!
మరాఠా గడ్డపై బీజేపీ వైరి పక్షాలను సీఎం కేసీఆర్ కలబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ ఆదివారం భేటీ కానున్నారు. కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్లారు. ముందుగా మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో చర్చలు జరిపి అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అవుతారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, గవర్నర్ల పొకడలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముంబాయిలో ‘దేశ్ కీ నేత’ అంటూ ఫ్లెక్సీ, కటౌట్లు వెలిశాయి. ముంబాయి టూర్ ముగిసిన తరువాత మరొకరోజు కర్నాటక వెళ్లనున్నారు కేసీఆర్. అక్కడ మాజీ ప్రధాని దేవగౌడతో భేటీకానున్నారు. అలానే ఢిల్లీ కేంద్రంగా మమత నిర్వహించే సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read:-కేసీఆర్ పోరాటానికి విపక్షపాలిత రాష్ట్రాల మద్దతు! మాజీ ప్రధాని ఫోన్!!











