ఉమ్మడి నిర్ణయంతో ముందుకు..
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చేపట్టిన ఉద్యమం తీవ్ర దశకు చేరబోతోంది! 12 ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఉమ్మడి కార్యచరణ ప్రకటించింది! సీపీఎస్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ, డీఏ, టీఏలు ఇవ్వాలని బలంగా కోరుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
కార్యచరణ ప్రకటన..
పీఆర్సీ సాధన పేరుతో ఆ నాలుగు జేఏసీ నేతలు 13 లక్షల మంది ఉద్యోగుల హక్కులకు ఉరి బిగించారని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 5న మంత్రుల కమిటి భేటీలో ఉపాధ్యాయ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావన తీసుకురాకుండా దాటివేశారని, మంత్రుల సమావేశం నుంచి ఫ్యాప్టో నాయకులు బయటకొచ్చారు. తక్కువ ఫిట్మెంట్ 23 శాతాన్ని ఒప్పుకోవడమేకాక, సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం దాటవేసేలా స్టీరింగ్ కమిటీ నేతలు సహకరించారని ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘జస్టీస్ ఫర్ పీఆర్సీ’ పేరిట జస్టిస్ ఫర్ పీఆర్సీ పేరిట తీర్మానాలు చేసామని ఫ్యాఫ్టో సెక్రటరీ జనరల్ శరత్ చంద్ర వెల్లడించారు. 14, 15 తేదీలలో సీఎంతో చర్చించాలని ప్రాతినిధ్యం పంపుతామని పేర్కొన్నారు. 14న సీఎస్ కు కార్యాచరణపై నోటీసు అందజేస్తామని చెప్పారు. అలానే 15 నుంచి 20 వరకు పీఆర్సీపై పున: సమీక్షకు సంతకాలు సేకరణ, 21 నుంచి 24 వరకు ఉద్యోగ ఉపాధ్యాయ ఫెన్షనర్లతో బ్యాలెట్ల నిర్వహణ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞాపన సమర్పణ, 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ, మార్చి 2, 3 తేదీలలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష, మార్చి 7, 8 లలో రాష్ట్రస్థాయి రిలే నిరాహారదీక్ష వంటి కార్యక్రమాలు చేపడతామని శరత్ చంద్ర పేర్కొన్నారు.
Must Read:-పీఆర్సీపై సాగుతున్న చర్చోపచర్చలు! పెన్ డౌన్ కంటిన్యూ!!











