ఒకపక్క చర్చలు.. మరోపక్క కొనసాగుతున్న నిరసనలు!
పీఆర్సీ పై నెలకొన్న ఉత్కంఠత శనివారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రులు కమిటీతో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యింది. అర్థరాత్రి వరకు సాగిన ఈ సమావేశంలో గతంలో ప్రతిపాధించిన అనేక డిమాండ్లును ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పునరుద్ఘాటించారు. హెచ్ఆర్ఏ శ్లాబ్స్ ను గతంలో మాదిరిగా కొనసాగిస్తున్నట్లు లీకులు బయటకొచ్చినా.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలానే సీపీఎస్ రద్దు, సీసీఏ పై చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఆర్థిక పరమైన అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు ఉదయ 10 గంటల నుంచి ఉద్యోగ సమస్యలపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ భేటీ కానున్నది. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు స్టీరింగ్ కమిటీతో మరోసారి మంత్రులు కమిటీ భేటీ కానున్నది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం యధావిధిగా కొనసాగాలని స్టీరింగ్ కమిటీ పిలుపునచ్చింది!
ఉపాధ్యాయులు పెన్ డౌన్, ఆర్టీసీ సమ్మెకు సై!!
ప్రభుత్వంతో చర్చలు కొనసాగతున్న వేళ.. మరోవైపు ఉద్యోగులు నిర్విరామంగా ఉద్యమం పేరుతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం నుంచి ఉపాధ్యాయులు యాప్ డౌన్ చేయనున్నారు. విద్యాశాఖ కు చెందిన యాప్ లను టీచర్ల డౌన్ చేశారు. అలానే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉదయం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల ముందు ప్రభుత్వం విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు.