పీఆర్సీపై ఉద్యమ కార్యచరణ ..
పీఆర్సీ సాధన సమితి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ఉపాధ్యాయ సంఘాలకు తీవ్ర నిరాశే మిగిలింది! ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించి, సమ్మె విరమిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ నిర్ణయాన్ని ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ వ్యతిరేస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదనలను ఈ మూడు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ చర్చల్లో స్టీరింగ్ కమిటీ ఏకపక్షంగా వెళ్లిందని, అందుకే రాష్ట్రంలోని జేఏసీ ఛైర్మన్లకు తమ రాజీనామాలు పంపుతున్నామని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం సాగుతోంది..
పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీపీఎస్ రద్దు, అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ నివేదిక బహిర్గతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరౌతున్నట్లు ప్రకటించారు. వచ్చే శుక్రవారం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యంగా పిలుపు నిచ్చాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 12 సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటాయి. పీఆర్సీ ఫిట్మెంట్ పై ప్రధానంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టనున్నారు. 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, సీపీఎస్ రద్దు వంటివి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరౌతున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనలకు ఆర్టీసీ సిబ్బంది కూడా మద్దతు తెలిపింది!
Must Read :-మోసం గురూ.. ‘ఖాకీలకూ సైతం టోపి’.. జీతాల్లో కోతలు!










