వైసీసీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరింత దూకుడు మీద ఉన్నారు. జగన్ కు లేఖల మీద లేఖలు రాస్తూ ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తుకుతెస్తూ.. ఎప్పుడూ పరిష్కరిస్తారంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికే ఐదు లేఖలు రాసిన రఘురామ మరో లేఖను కూడా సంధించాడు. మంగళవారం ఆరో లేఖను సీఎం జగన్ కు రాశారు. ఉద్యోగులకు డీఏ పెంపు హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కారణమేనని, డీఏ పెంపు ఇచ్చిన హామీని పరిష్కరించాలని ఆరో లేఖలో కోరారు.
Must Read ;- ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి : సీఎం జగన్ కు మరో లేఖ రాసిన రఘురామ











