Rahul Gandhi Rides Tractor To Parliament, To Protest Against New Farm Law :
కొత్త వ్యవసాయ చట్టాలను రైతుల కోసమే తీసుకొచ్చామని, ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం చెబుతున్నా.. కానీ కేంద్రం వాదనలో వాస్తవం లేదని రైతులు చెబుతున్నారు. ఈ చట్టాలతో లాభం కంటే నష్టమే కలుగుతుందని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు న్యూఢిల్లీలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు కరోనా నిబంధనలు పాటిస్తూనే.. మరోవైపు శాంతియుతంగా నిరసనను కొనసాగిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా తమ పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు. రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఇతర పార్టీలు సైతం సంఘీభావం ప్రకటిస్తున్నాయి.
రైతులకు రాహుల్ మద్దతు
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. సోమవారం ఉదయం రాహుల్ గాంధీ ట్రాక్టరు నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టరు నడిపిన రాహుల్ తన మద్ధతు ప్రకటించారు. ఈ చట్టాల వల్ల రైతులకు మద్ధతు ధర రాదని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు రాహుల్ గాంధీ మరోసారి మద్ధతు ప్రకటించారు. సాగు చట్టాలపై రైతుల పక్షాన పోరాడుతానని, ఇందుకోసం పార్లమెంట్ ను సైతం స్తంభింపచేస్తానని ప్రత్యక్షంగా మోడీపై విరుచుకుపడ్డారు. ఈ కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తల కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారనే విషయం యావత్ దేశానికి తెలుసని చెప్పారు.
పెగాసస్ పై పోరు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు ఒక రోజు ముందే పెగాసస్ స్పైవేర్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో, పార్లమెంటు ఉభయసభలు ఈ అంశంపై దద్దరిల్లుతున్నాయి. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తన సొంత ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని, తాను ప్రతిపక్ష నేతనని, ప్రజావాణిని వినిపించాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోదీఫై కూడా సుప్రీంకోర్టు విచారణ అవసరమేనని వ్యాఖ్యానించారు. ఇండియా పైన, ఈ దేశ సంస్థలపైన ఈ స్పై వేర్ ని ప్రధాని, హోమ్ మంత్రి ప్రయోగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Must Read ;- కాంగ్రెస్లో ప్రియాంక శకం ప్రారంభమైనట్టేనా?
देश के अन्नदाता की मांगों के समर्थन में राहुल गांधी जी मैदान में हैं, देश के अन्नदाता की आवाज संसद में बुलंद कर रहे हैं।
तानाशाही हुकूमत सुन ले- न देश का अन्नदाता दबेगा, न अन्नदाता की आवाज दबेगी।#RahulGandhiWithFarmers pic.twitter.com/0PV7vvSZHC
— Congress (@INCIndia) July 26, 2021











