డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇండియా అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య హోరాహోరీ తప్పదనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఒకవైపు ఇండియా పేలవ ప్రదర్శన.. మరోవైపు వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్ కూడా చప్పగా సాగింది. ఇప్పటివరకు 141.1 ఓవర్లు మాత్రమే సాగాయి. వర్షం, వెలుతురు లేని కారణంగా ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఒక్కరోజు కూడా ఆట పూర్తిగా సాగలేదు. దీంతో సోమవారం బంతి పడకుండానే ఆట రద్దు చేయాల్సి వచ్చింది.
ఇవాళ వరుణుడు కనికరించడంతో వాతావరణం మ్యాచ్కు అనుకూలంగా మారింది కివీస్ తన తొలి ఇన్సింగ్స్ ప్రారంభించింది. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడం, పిచ్పై తేమ ఉండడంతో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 12, రాస్ టేలర్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. పిచ్ పై తేమ ఉండటంతో భారత బౌలర్లు ఎంత వరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే..
ఫైనల్ నిర్వహణ ఇలాగేనా?
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ లో నిర్వహించడం కూడా పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. వాన గండం ఉంటుందని తెలిసినా.. ఇంగ్లాండ్ పిచ్ లపై మ్యాచ్ ఎలా నిర్వహిస్తారని క్రికెట్ మేధావులతో పాటు అభిమానులు సీరియస్ అవుతున్నారు. డబ్ల్యూటీసీ విజేతను తేల్చాలంటే కేవలం ఒక్క మ్యాచ్ సరిపోదని, మూడు మ్యాచ్ ల సిరీస్ లు ఆడించాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీం ఇండియా కోచ్ రవిశాస్ర్తి సైతం ఇదే మాటను చెప్పారు. మ్యాచ్ విజేతను తేల్చాలంటే.. అందుకు దుబాయ్ ను ఎంచుకుంటే బాగుండేదని, వాతావరణ పరిస్థుతులు కూడా అనుకూలిస్తామని అభిప్రాయపడుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను తప్పించడం కూడా టీంఇండియాకు బాగా నష్టం కలిగించింది. ఇంగ్లాండ్ పిచ్లపై రికార్డ్ భువనేశ్వర్ కుమార్ని పక్కన పెట్టడంతో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
Must Read ;- అతడే నా హీరో : ధోనీపై మనసు పారేసుకున్న రష్మిక