జనవరి 26న గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలను ప్రతి సంవత్సరం దేశమంతా పండగలా జరుపుకుంటారు. నేడు 72 వ గణతంత్ర దినోత్సవం. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజల వరకు జరుపుకునే పండగ ఇది. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకలను ప్రతి సంవత్సరం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
Must Read ;- మరణానంతరం పద్మవిభూషణుల్లో బాలు