రాజమౌళి పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్టర్ విడులైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను జనం ఆకాశానికి ఎత్తే పోస్టర్ ఇది. చారిత్రాత్మక కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా, చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
అక్టోబరు 13వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈరోజు ఈ పోస్టర్ తో చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. ఇద్దరు హీరోల అభిమానులకూ పండగ చేసే పోస్టర్ ఇది. ఇందులో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లురి సీతారామరాజుగా, ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమురం భీమ్ గా కనిపించనున్నారు. రాజమౌళి బాహుబలి తర్వాత అంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ఇది.
Must Read ;- కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్