(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
మాజీ ఎంపీ సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.ఆయనకు వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు. చికిత్సకు కొంతవరకు సబ్బం హరి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
“ నాన్నగారు (సబ్బం హరి గారు) ఆరోగ్యం, వైద్యుల పర్యవేక్షణలో నిలకడగా ఉంది. మీ అందరి ప్రార్థనలు, ఆ భగవంతుని దీవెనలతో త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను “ అని ఆయన కుమారుడు వెంకట్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
సబ్బం హరికి కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధరణ కావటంతో కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న కొవిడ్ నిర్ధారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నారు. పరిస్థితి కొంత విషమించడంతో గత బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు. సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Must Read ;- చంద్రబాబు పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం : సీఐడి అధికారులు ఒత్తిడి