సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ డైరెక్టర్లు హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డైరెక్టర్లు పిటిషన్లో పేర్కొన్నారు. 11 సంవత్సరాల కిందటే సంగం డెయిరీ మ్యాక్స్ సహకార రంగం నుంచి బయటకు వచ్చి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా అవతరించిందని డైరెక్టర్లు పిటిషన్లో గుర్తు చేశారు. దీనిపై ఇప్పటికే కోర్టులో విచారణ నడుస్తుండగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై డైరెక్టర్లు పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నరేంద్ర బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే
అవకాశం..
సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగం డెయిరీలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడంతో పాటు, ఫోర్జరీ సంతకం ద్వారా సహకార రంగంలోని డెయిరీని ప్రైవేటు సంస్థగా మార్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసి, దూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నరేంద్ర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Must Read ;- ఏసీబీ కోర్టులో నరేంద్ర బెయిల్ పిటిషన్











