టాలీవుడ్ అజేయ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవడంతో.. ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలందరూ పోటీ పడుతున్నారు. అలాంటి వారి లిస్ట్ లోకి ఇప్పుడు మీడియమ్ రేంజ్ హీరో శర్వనంద్ కూడా చేరిపోయాడు. ఈ ఇద్దరి మధ్యా కథా చర్చలు కూడా జరిగాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కొంత కాలంగా సరైస స్థాయిలో సక్సెస్ సాధించ లేకపోతున్న శర్వానంద్ .. ఎర్లియర్ గా శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమా పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం అజేయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తున్న శర్వా.. మరో పక్క కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాను కూడా లైన్ లో పెట్టుకున్నాడు. ఇక అనిల్ రావిపూడితో కూడా సినిమా ఓకే అయితే.. మనోడి దశ తిరిగినట్టే.
ప్రస్తుతం వెంకీ, వరుణ్ తేజలతో ‘ఎఫ్ 3’ మూవీ తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి.. మరో పక్క బాలయ్యతో కూడా ఓ సినిమా కమిట్ అవుతున్నాడు. అది కంప్లీట్ అవ్వగానే శర్వానంద్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడని తెలుస్తోంది. మొత్తం మీద చిన్న, పెద్ద, మీడియమ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నాడు అనిల్ రావిపూడి. మరి శర్వానంద్ తో అనిల్ ఏ రేంజ్ మూవీ తీస్తాడో వెయిట్ అండ్ సీ.
Must Read ;- బాలకృష్ణను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్న అజేయ దర్శకుడు