రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల సమీక్షలో భాగంగా.. కడప జిల్లాలో పర్యటించనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి కడప కలక్టరెట్లో అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చలు జరిపారు. నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా ఏర్పాట్ల చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా అధికర గణమంతా నిమ్మగడ్డ సమీక్షకు హాజరుకావడం విశేషం. ఎస్పీలు, డిఎస్పి, కలెక్టర్.. తదితర అధికారులంతా సమీక్షలో పాలుపంచుకున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో తొలిరోజు 3,515 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 1315 సర్పంచ్లకు పోటీ చేస్తున్నారు. 2200 వార్డులలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని, 165 మండలాలలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి1న నామినేషన్లను పరిశీలించిన మీదట.. ఉపసంహరణకు 4వ తేదీ వరకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. ఫిబ్రవరి 9న పోలింగ్, కౌంటింగ్ ఉంటాయి. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
Mjst Read ;- కత్తి దూసిన నిమ్మగడ్డ.. వేటు షురూ!











