మహిళల భద్రతే లక్ష్యంగా ఏర్పడ్డ షీటీమ్స్ పోకిరీలకు చుక్కలు చూపిస్తోంది. షీటీమ్స్ చురుగ్గా పనిచేస్తుండటం, ఆకతాయిల బారిన పడ్డ మహిళల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో గస్తీ కార్యక్రమాలను మొదలుపెట్టింది. సీపీ సజ్జనార్ ఆదేశాలతో రాత్రి సమయాల్లో కూడా షీటీమ్స్ పెట్రోలింగ్ చేస్తోంది. రాత్రివేళల్లో అమ్మాయిలను పోకిరీలు ఎక్కువగా వేధిస్తున్న 50కి పైగా హాట్స్పాట్లను గుర్తించారు. దీంతో షీటీమ్స్ మఫ్టీలో గస్తీ తిరుగుతూ, ఆకతాయిలపై ఆట పట్టిస్తోంది. మహిళలను వేధించే సంఘటనలు కంట పడితే, అక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నాయి. ఐటీ కారిడార్ ప్రాంతాలైన రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ ప్రాంతాల్లో ఉద్యోగిణులు, మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా ఉండటంతో రాత్రి పూట షీటీమ్స్ గస్తీ తిరుగుతున్నాయి. పకడ్బందీగా గస్తీ తిరుగుతూ మహిళలకు భరోసా కల్పిస్తోంది.
Must Read ;- మాస్క్ మస్ట్, లేదంటే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్