మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి రాజీనామాల పర్వం ఆగలేదు. నాగబాబు, ప్రకాష్ రాజ్ ల బాటలోనే శివాజీరాజా కూడా పయనించారు. గతంలో ఆయన మా అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇచ్చారు. అసలు ఈ అసోసియేషన్ పదవీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించాలన్న ప్రతిపాదనను శివాజీ రాజా ఎప్పట్నుంచో చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తరఫున శివాజీ రాజా నిలబడి ప్రచారం చేయగా, మరో మాజీ అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణు ప్యానల్ వైపు ప్రచారం సాగించారు.
ఈ పదవుల మాటేమోగానీ ఈ ఎన్నికల వల్ల వ్యక్తిగత కక్షలు కూడా పెరుగుతున్నాయి. నిన్న జరిగిన పోలింగులో మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎక్కువ మంది గెలుపొందారు. విష్ణు గెలుపొందిన వెంటనే రాజీనామాల పర్వం కొనసాగింది. చాలా మంది ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న నాగబాబు రాజీనామా చేయగా, ఈరోజు ఉదయం ప్రకాష్ రాజ్ తన రాజీనామాను ప్రకటించారు.
ఇప్పుడు శివాజీ రాజా తన రాజీనామాను ప్రకటించారు. అసలు మాలో గొడవలన్నిటికీ ప్రధాన కారణం మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ నని ఆయన ఆరోపిస్తున్నారు. లేకుంటే ఈ ఎన్నిక ఇంతలా రచ్చ అయి ఉండేది కాదన్నారు. ఇంతలా అవమానం జరిగాక ఇక ఆ అసోసియేషన్ లో కొనసాగడం అనవసరం అనుకున్నట్టుంది అందుకే రాజీనామా చేశారు. మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు. మళ్లీ ఎన్నికలు వస్తే పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. ఇదే బాటలో మరికొందరు కూడా పయనిస్తారేమో చూడాలి.
Must Read ;- ‘మెగా’ బాహువుల్లో బలి ఎవరు?











