January 27, 2021 9:20 AM
18 °c
Hyderabad
23 ° Wed
23 ° Thu
23 ° Fri
23 ° Sat
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మన ముందే ఉన్న తొలి తరం కథానాయిక కృష్ణవేణి (జనదిన ప్రత్యేక కథనం)

మొట్టమొదటి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’అనే సంగతి మన అందరికీ తెలిసిందే. 1930-1940 ధశకాన్ని తొలితరంగా చెప్పాలి. అప్పట్లో కన్నాంబ, శ్రీరంజని, అంజలీ దేవి, సావిత్రి.. ఇలా చాలామంది ఉండేవారు. వారిలో కృష్ణవేణి కూడా ఒకరు.. ఆనాటి విశేషాలు ఆమె నోటి నుంచే తెలుసుకుందాం.

December 25, 2020 at 5:58 PM
C Krishnaveni
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 తొలితరం హీరోయిన్లలో ఇప్పటికీ ఓ కథానాయిక మన ముందే ఉన్న విషయం మీకు తెలుసా? తన 12వ ఏటనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా, నిర్మాతగా ఆమె ఎందరికో సుపరిచితురాలు.

విశేషం ఏమిటంటే తెలుగు సినిమా లెజండ్ నందమూరి తారకరామారావును నటుడిగా, హీరోగానూ పరిచయం చేసింది కూడా ఆమే. ఒక్క ఎన్టీఆరే కాదు ఎస్వీ రంగారావు, ఘంటసాల, అంజలీదేవి లాంటి ఎందరో అతిరథమహారథులను ఆమె సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆమె ఎవరో కాదు మీర్జాపురం రాజా సతీమణి కృష్ణవేణి. డిసెంబరు 26వ తేదీ ఆమె పుట్టిన రోజు. 97 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా చురుకుగా మన కళ్లముందే ఉన్నారు. కరోనాని సైతం లెక్క చేయకుండా నిండు నూరేళ్ల జీవితానికి ఆమె చేరువవుతున్నారు.

1924లో జన్మించిన ఆమె తన 12వ ఏటనే సినిమా రంగంలో అడుగుపెట్టారు. సతీఅనసూయ (ధ్రువ) సినిమాతో బాల నటిగా సినిమా రంగంలో అడుగుపెట్టారామె. ఆ తర్వాత కథానాయికగా 15 సినిమాలు చేశారు. మీర్జాపురం రాజాతో వివాహం జరిగాక చిత్ర నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. కొన్ని సినిమాలకు ప్రత్యక్షంగా, మరి కొన్నిటికి పరోక్షంగా ఆమె నిర్మాతగా వ్యవహరించారు. మంచి గాయని కూడా. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడినప్పుడు ఆనాటి విశేషాలను ‘లియో న్యూస్’కు వివరించారు. కృష్ణవేణి గారికి లియో న్యూస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటోంది.

* మీ సొంతూరు ఏది.. ఆ వివరాలు చెప్పండి?
– నేను పుట్టింది రాజమండ్రిలోనే. నాన్నగారు పశ్చిమగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం రాజా దగ్గర వైద్యుడిగా చేసేవారు. నా ఆరో ఏటనే అమ్మ చనిపోవడతో నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మధ్య కూడా పొసగక విడిపోవాల్సి వచ్చింది. దాంతో నేను రాజమండ్రిలోనే బాబాయి గారింట్లో పెరిగాను. వరసకు ఆయన బాబాయి అవుతారు సొంత బాబాయి కాదు.

*  మీ వారి పేరు చెబుతారా?
– మావారి పేరు మేకా వెంకట్రామయ్య అప్పారావు. రంగయ్య అప్పారావుగారు మావారికి సోదరుడు.

* అసలు ఈ అప్పారావు ఎవరు? పేరు చివరి ఈ పేరు ఎందుకు వస్తోంది?
– అది మావారి వంశానికి వారసత్వంగా వస్తోంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది.

* రాజా వారితో మీది సహజీవనం అనుకోవచ్చా?
– మాది సహజీవనం కాదు వివాహమే. ఆయన మొదటి భార్య భూదేవి సన్యాసం తీసుకోవడం వల్ల నన్ను ఇష్టపడ్డారు. పెళ్లి ప్రతిపాదన ఆయనే తెచ్చారు. మా బాబాయితో మాట్లాడి పెళ్లి చేసుకున్నారు.

* మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భార్య నుంచి అభ్యంతరాలు రాలేదా?
– ఎందుకు రాలేదు.. వచ్చాయి. అందుకే రహస్యంగా విజయవాడలోని సత్యనారాయణపురంలో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత అందరం బాగానే కలిసిపోయాం. భూదేవికి నలుగురు పిల్లలు. నాకు ఒక్కటే కుమార్తె. నా ఆరోగ్యరీత్యా ఒక్క కూతురితోనే సరిపెట్టకున్నాం.

* అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?
– ‘జీవనజ్యోతి’ సినిమా టైంలో. అప్పడు నావయసు 15 . ఆ సినిమాలో నేను హీరోయిన్. నారాయణరావుకు హీరోగా అది తొలి సినిమా. రాజాగారే ఈ సినిమా ద్వారా ఆయనను పరిచయం చేశారు. రాజావారికీ నాకూ వయసులో చాలా తేడా ఉంటుంది. నాకన్నా 20 ఏళ్లకు పైనే ఆయన పెద్ద.

* మీ సినిమా జీవితం ఎలా ప్రారంభమైంది?
– ‘సతీ అనసూయ’ సినిమాని సి. పుల్లయ్యతో తీశారు. అందులో నేనే హీరోయిన్. నావయసు 12 కూడా ఉండదు. అందరూ బాల నటులే. ఈ అవకాశం రేలంగి వెంకట్రామయ్య ద్వారా వచ్చింది. ఆయన ప్రొడక్షన్ లో చిన్పపుడే నేను నాటకాలు వేశాను. ‘రామదాసు’ అనే నాటికలో కమల పాత్ర వేశాను. రాజమండ్రిలో ఆ ప్రదర్శనను సి. పుల్లయ్యగారు చూశారు. రేలంగి ద్వారా నన్ను మద్రాసు పిలిపించుకుని అనసూయ వేషం ఇచ్చారు. మద్రాసు వచ్చాక స్టూడియోలోనే ఉండేవాళ్లం. 13వ ఏటనే హీరోయిన్ ని అయ్యాను. రాజావారి జయా ఫిలింస్ నిర్మించిన ‘భోజకాళిదాసు ’ సినిమాలో కన్నాంబ హీరోయిన్. నేను సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత ‘కచదేవయాని’లో హీరోయిన్ గా చేశా. నా నట జీవితమంతా జయాఫిలింస్ కే పరిమితమైంది. పెళ్లి తర్వాత రాజాగారు సినిమాలు చేయవద్దన్నారు గానీ మా సినిమాల్లో చేయడానికి అభ్యంతరం పెట్టలేదు.

* మహానటి సావిత్రితో మీకు పెద్దగా అనుబంధం లేదనుకుంటా?
– లేకేం.. కలిసి సినిమాలు చేయకపోయినా అన్యోన్యంగా ఉండేవాళ్లం. భోళా మనిషి. ఎలా బతకాలో తెలియదు. తన భోళాతనం వల్ల ఇబ్బంది పడింది. శివాజీ గణేశన్ తో చేసిన ‘సరస్వతీ శపథం’ సినిమాని మేం తెలుగులోకి డబ్ చేశాం. అందులో సావిత్రి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పింది. మేం డబ్బులు ఇవ్వబోయినా తీసుకోలేదు.

*  సినిమా నటులంతా తమ చివరి దశలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు?
– జాగ్రత్త లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంతెందుకు నాగయ్య కూడా ఇబ్బందులు పడ్డవారే. ఎంతో డబ్బు సంపాదించినా ఆయన నిలుపుకోలేకపోయారు. ఆడవారికే కాదు మగవారికీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి.

* ఆర్థికంగా మీరు ఎలా స్థిరపడగలిగారు?
– మాకు ఎలాంటి లోటూ రాకుండా రాజావారు ఏర్పాట్లు బాగా చేశారు. 1974లో ఆయన చనిపోయినా మేం ఇబ్బందేమీ పడలేదు. మా అమ్మాయి అనురాధాదేవి నిర్మాతగా ఎన్నోమంచి సినిమాలు తీసింది. కాకపోతే మా ఆస్తులు కొన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టుల్లోనే నలుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చిన భూమి మావారిదే. అందుకే దానికి ఆయన పేరు పెట్టారు.

Must Read ;- గయ్యాళి అత్త .. అమాయకపు అమ్మ (సూర్యకాంతం వర్ధంతి ప్రత్యేకం)

* మనదేశంలో సినిమాలో ఎన్టీఆర్ పలికిన తొలిడైలాగ్ గుర్తుందా?
– లేదండీ… కాకపోతే ఆ సినిమాలో ఆయన పలికిన ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ‘ఇంతవాణ్ణి అంతవాణ్ణి అయ్యాను’ అనే డైలాగ్ ఏదో ఉంది. ఆ ప్రకారమే ఆ తర్వాత జరగడంతో ఈ డైలాగ్ అంత ప్రాముఖ్యం ఏర్పడింది.

* ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ ఎంత?
– సరిగా గుర్తులేదు. అడ్వాన్స్ రెండొందల యాభై అనుకుంటాను. చెక్కు రాసి ఎల్వీ ప్రసాద్ కు ఇచ్చాను. ఎల్వీ ప్రసాద్ ఆ చెక్కును ఆయనకు ఇవ్వబోతే నన్ను చూసి ‘వారి చేతుల మీదుగానే ఇప్పించండి’ అన్నారు. మొదటి చెక్కు కదా.. అది అందుకున్న ఆనందం ఆయన కళ్లలో కనిపించింది. ఆయన అంత పెద్దనటుడు అవుతాడని మేం ఊహించలేదు. మొత్తం ఈ సినిమాకు ఆయనకు రెమ్యూనరేషన్ గా రెండువేలు ఇచ్చినట్లు గుర్తు.

* ‘మనదేశం’ సినిమా ఎంత సక్సెస్ అయ్యింది?
– అంతపెద్ద హిట్ కాదుగానీ నష్టాలు మాత్రం రాలేదు. కాకపోతే నిర్మాణ వ్యయం పెరిగిపోవడం వల్ల పెద్దగా మిగల్లేదు. ‘పల్లెటూరి పిల్ల’ మాత్రం పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేసింది కూడా మేమే. బీఏ సుబ్బారావు ద్వారా ఆ సినిమా మేమే తీయించాము.

* 97 ఏళ్ల వయసులోనూ మీరు ఎంతో ఆరోగ్యం ఉన్నారు.. ఆ రహస్యం ఏమిటి?
– నేను ప్రత్యేకంగా ఆరోగ్యసూత్రాలేమీ పాటించను. ఉదయపు నడక వదల వద్దని అక్కినేని నాగేశ్వరరావుగారు అంటుండేవారు. నాన్ వెజ్ కూడా బాగానే తింటాను. ఇప్పుడు నాకు 97ఏళ్లు. నా పనులు నేనే చేసుకుంటాను.

* ఏమేం అవార్డులు వచ్చాయి?
– మావారికి ఈ అవార్డుల మీద అంత నమ్మకం లేదు. నాకు రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది.

* ‘మనదేశం’ సినిమా తీయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
– నేను కాంగ్రెస్ పార్టీ అభిమానురాలిని. నాలో దేశభక్తి బీజాలు ఉన్నాయి. అందుకే అలాంటి సినిమా తీయాలనుకున్నా. మావారు జస్టిస్ పార్టీ. మీకు తెలిసిందే కదా జస్టిస్ పార్టీ బ్రిటీషువారికి అనుకూలంగా ఉంటుంది. మావారికి ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశాను. నిజానికి మా వారిని వ్యతిరేకించి ఆ సినిమా తీశాను.

* స్వాతంత్రం రాకముందు జరిగే కథాంశంతో సినిమా ఎంచుకున్నారు. విడుదల స్వాతంత్రం వచ్చాక జరిగింది. ఎంచుకున్న కథే అలాంటిదా? లేదా సినిమా షూటింగ్ స్వాతంత్ర్యం రాకముందు జరిపారా?
– లేదు సినిమాని స్వాతంత్ర్యం రాకముందే ప్రారంభించాం. కానీ పూర్తికావడానికి చాలాకాలం పట్టింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. విడుదల ఆలస్యం కావడం వల్ల చిత్రనిర్మాణ ఖర్చు కూడా బాగా పెరిగింది. ‘విప్రదాస్’ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమా తీశాం.

* తెలుగులో సినిమాగా వచ్చిన తొలి బెంగాలీ నవల ఇదేనని చెబుతారు. ఈ నవల మీ దృష్టిలో ఎలా పడింది?
– అప్పట్లో నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. ముఖ్యంగా బెంగాలి రచయిత శరత్ బాబు అన్నా నాకు అభిమానం. అలా ఈ సినిమా కథని ఎంచుకున్నాం. తెలుగులో సినిమాగా వచ్చిన మొదటి బెంగాలీ నవల ఇదే అవుతుంది. అసలు ‘దేవదాసు’ సినిమా కూడా మేమే చేయాలనుకున్నాం. ఈలోగా వచ్చేసింది.

*  ఆ సినిమాకు హీరో నారాయణరావుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? నాగయ్య కు ఇచ్చిన దెంత?
–  సరిగా గుర్తులేదు. నాగయ్య పెద్ద హీరో కాబట్టి 40 వేలు దాకా ఇచ్చి ఉంటాను. నారాయణరావుకు 15వేల నుంచి 20 వేల మధ్యలో ఉండొచ్చు. అప్పట్లో నాగయ్య పారితోషికం చాలా ఎక్కువ ఉండేది. ‘చక్రధారి ’ సినిమాకి ఆయనకు 90 వేలు ఇచ్చాం. అప్పట్లో అదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్.

* సమర్పకురాలు కావాలన్న ఆలోచన ఎవరిది? మీదా, రాజావారిదా?
– నాదే.. ఆయన వద్దన్నా ఈ సినిమా తీశాను.

* మీరు నిర్మాతగా తొలిచిత్రం ఏది?
– ‘మనదేశం’తోనే నిర్మాతగా మారాను. పుస్తకాలు ఎక్కువగా చదవడంవల్ల కథల మీద నాకు పట్టుండేది. వరసగా ఐదు సినిమాలు తీశాను. హీరోయిన్ గా నేను నటించిన సినిమాల్లో నా పాత్రకు నేనే పాటలు పాడేదాన్ని. ‘కీలుగుర్రం’ సినిమాతో అంజలీ దేవిని హీరోయిన్ ని చేశాం. మొదట ఆమె ఆ పాత్ర చేయడానికి ఇష్టపడలేదు. రాత్రపూట రాక్షసిగా మారే పాత్ర కాబట్టి వద్దని అంది. మేం నచ్చచెప్పి ఒప్పించాం. ఇందులో కూడా ఆమెకు నేనే పాడాను. నేను పాట పాడితేనే చేస్తానంది.

* మీ సినిమాల్లో కొత్తవారికి చాలామందికి అవకాశాలు కల్పించారు. ఈ ఆలోచన ఎందుకొచ్చింది?
– మేం మొదటి నుంచి అలా చేస్తూనే ఉన్నాం. అంజలీదేవి, జూనియర్ శ్రీరంజని, సూర్యకాంతం, ఎస్వీరంగారావు… ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే వస్తారు. అసలు ఎస్వీరంగారావు నటుడిగా పనికిరాడని ‘వరూధిని’అనే సినిమా నుంచి తొలగించారు. ఆ సినిమాలో ఆయన ప్రవరాఖ్యుడి వేషం వేశారు. అసలు ఆ సినిమా ఆడనుకూడా ఆడలేదు. విషయం తెలిసి ఆయనను పిలిపించి ‘మనదేశం’ సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించాం. ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తీశాం. ఎం.ఆర్.ఎ. అంటే మేకా రాజ్యలక్ష్మ్మీఅనూరాధ. మా అమ్మాయి పేరు మీద ఈ సినిమా తీశాం. ఆ తర్వాత ఈ బ్యానర్ పై సినిమాలు తీయలేదు.

* ఎన్టీఆర్ మీ దృష్టిలో ఎలా పడ్డారు?
– మా సినిమా దర్శకుడు ఎల్వీప్రసాద్ తీసుకొచ్చారు. నేను ఆఫీసుకు వచ్చేసరికి వారిద్దరూ కూర్చుని ఉన్నారు. ఇన్ స్పెక్టర్ పాత్రకు ఈయనను అనుకుంటున్నాను అన్నారు. సరేనన్నాను. అడ్వాన్స్ గా మూడొందల రూపాయలు ఇచ్చాము. ఈ సినిమాకి ఎల్వీప్రసాద్ కు ఇచ్చింది 15వేలు అని గుర్తు. ఈ డబ్బుతోనే మద్రాస్ గాంధీనగర్ లో ఆయన ఇల్లు కొన్నారు.

* ఎన్టీఆర్ పెద్ద నటుడు అవుతాడని అప్పుడు మీరెవరైనా ఊహించారా?
– లేదు.. కాకపోతే ఆయనను చూడగానే బాగున్నాడని అనుకున్నాం. అలాగే ఆయనకు హీరోగా కూడా మేమే అవకాశమిచ్చాం. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమా. ఆయన రెండో సినిమా అదే.

* ఈ సినిమా నిర్మించింది బీఏ సుబ్బారావు కదా?
– లేదు మాదే.. ఆయన పేరుతో రాజాగారే నిర్మించారు. బీఏ సుబ్బారావు మా ప్రొడక్షన్ మేనేజర్. మా స్టూడియో వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారు. ఇందులో అక్కినేని నాగేశ్వరావుగారు నటించినా మెయిన్ హీరో ఎన్టీఆరే.

* ఆ రోజుల్లో పారితోషికాలు ఉండేవా? జీతాలు ఉండేవా?
– జీతాలే ఉండేవి. మా స్టూడియో తరపున మేం నెలకు 49 వేల రూపాయలదాకా జీతాల రూపంలో చెల్లించేవాళ్లం. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం.

* మీ అమ్మాయి కూడా నిర్మాతే కదా?
– అవును.. రాజ్యలక్ష్మీ అనూరాధాదేవి నిర్మాతగా చాలా మంచి సినిమాలు తీసింది. అక్కినేని నాగేశ్వరరావుతో‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రావణుడే రాముడైతే’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘దాంపత్యం’, ‘చక్రధారి’… ఇలా చాలా తీసింది. రాజావారికి జాతకాలంటే విపరీతమైన నమ్మకం. నాకు అంతగా నమ్మకం లేదు. ఓ జ్యోతిష్కుడు రాజావారిని కలిసి మీకు పుట్టబోయే కూతురి పేరు శ్రీకృష్ణుడి భార్యలలో ఒకరిదై ఉంటుంది అన్నారట. మొత్తానికి ఆ జ్యోతిష్కుడికి కానుకగా పులిచర్మాన్ని ఇచ్చేశారు రాజావారు. అయినా శ్రీకృష్ణుడికి ఉన్న 16వేల మంది భార్యలలో ఒక పేరు ఉండటం పెద్ద విశేషం కాదని నాకు అనిపించింది.

-హేమసుందర్ పామర్తి

Tags: C KrishnaveniC Krishnaveni AgeC Krishnaveni BirthdayC Krishnaveni MoviesC Krishnaveni NewsC Krishnaveni Photosleotopmanadesam movientrproducer c.krishnaveniraghupathi venkayya awardee c.krishnavenitollywoodTollywood Movie Actress C Krishnaveniveteran actress c.krishnaveniveteran actress krishnaveni
Previous Post

దేవరశాంటా 2020 ఏం చేశాడో తెలుసా.?

Next Post

మాట జారి ఇరుక్కున్న మంత్రి అప్పలరాజు..!

Related Posts

Tollywood

షూటింగ్ లో చిక్కుకున్న ముగ్గురు కృష్ణులు (సుల్తాన్ తెర వెనుక కథ)

by Leo RK
January 27, 2021 8:43 am

1999వ సంవత్సరంలో విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా సుల్తాన్. ఇందులో బాలయ్యతో...

Tollywood
Acharya Movie

ప్రమోషన్స్ లో చిరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారుగా

by Leo RK
January 27, 2021 8:16 am

మెగాస్టార్ చిరంజీవి ఆమధ్య ట్విట్టర్ లో ఎంట్రీ ఇవ్వడం.. ఫన్నీగా, ట్రెండీగా ట్వీట్స్...

Tollywood

సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం 

by Leo RK
January 26, 2021 6:25 pm

టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. మంచి హైటూ పర్సనాలిటీతో,...

Tollywood

ట్రైలర్ టాక్ : క్రీడా రాజకీయంపై ఓ యువకుని పోరాటం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’

by Leo RK
January 26, 2021 6:01 pm

యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ఏ...

Tollywood

‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఖాయమైంది.. !

by Leo RK
January 26, 2021 5:29 pm

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్...

Tollywood

సింగిల్ డైలాగ్ చెప్పలేకపోయిన ఆమె..  700 సినిమాలు చేసిందట!

by Leo RK
January 26, 2021 5:17 pm

తెలుగు తెరపై ఐటమ్ సాంగ్స్ అనగానే జయమాలిని .. జ్యోతిలక్ష్మీ .. సిల్క్...

Tollywood

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారు

by Leo RK
January 26, 2021 4:23 pm

ప్రేమ అనేది ఒక అందమైన సబ్జెక్టు .. అర్థమైనట్టుగా, కానట్టుగా అనిపించే సబ్జెక్టు....

Tollywood

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుక

by Leo RK
January 26, 2021 4:03 pm

జనవరి 26న గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలను ప్రతి సంవత్సరం దేశమంతా పండగలా...

Tollywood

బాలీవుడ్ భామతో ‘పుష్ప’ చిందులు

by Leo RK
January 26, 2021 3:38 pm

సుకుమార్ ప్రాజెక్టు అనగానే దాదాపుగా ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్...

Tollywood

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ‘ఆహా’ అనిపించనున్న ‘క్రాక్’ 

by Leo RK
January 26, 2021 3:22 pm

తెలుగులో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా అవతరించిన 'ఆహా' ఇటు ప్రేక్షకుల మనసును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

కాశీవిశ్వేశ్వర ఆలయ గోపురం ధ్వంసం

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

నాగార్జున యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలు..

ముఖ్య కథనాలు

సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!

ప్రమోషన్స్ లో చిరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారుగా

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఖాయమైంది.. !

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుక

బాలీవుడ్ భామతో ‘పుష్ప’ చిందులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

నాగచైతన్య వెర్సెస్ నానీ

మార్చి 11న రిలీజ్ కానున్న సినిమాల్లో విన్నర్ ఎవరు?

సంపాదకుని ఎంపిక

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

‘స్థానికం’కు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. సీఎస్‌కి పరీక్షా కాలమే

రాజకీయం

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

వంచనకు గురై.. 18 మంది మహిళలను చంపిన సైకో కిల్లర్!

ఐజీ సంజయ్‌కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు

నాగార్జున యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలు..

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

అనుమతి కంటే ముందే ట్రాక్టర్ల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

సినిమా

షూటింగ్ లో చిక్కుకున్న ముగ్గురు కృష్ణులు (సుల్తాన్ తెర వెనుక కథ)

ప్రమోషన్స్ లో చిరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారుగా

సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం 

ట్రైలర్ టాక్ : క్రీడా రాజకీయంపై ఓ యువకుని పోరాటం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’

‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఖాయమైంది.. !

సింగిల్ డైలాగ్ చెప్పలేకపోయిన ఆమె..  700 సినిమాలు చేసిందట!

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుక

బాలీవుడ్ భామతో ‘పుష్ప’ చిందులు

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ‘ఆహా’ అనిపించనున్న ‘క్రాక్’ 

నాగచైతన్య వెర్సెస్ నానీ

జనరల్

కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆ నలుగురు : తెలుగు పద్మాలు.. వీరే!

కరోనాను కట్టడి చేస్తోన్న నారీ శక్తి!

రామతీర్థంలో విగ్రహాల ప్రతిష్ఠకు శ్రీకారం

జీవితంలో ఇదే ఆల్ జీబ్రా.. సెక్స్ లేకుంటే ‘గుండె’ గాభరా

నేడు సుప్రీం ఎదుటకు ఏపీ ‘పంచాయతీ’

చంపేసి, నోట్లో రాగిచెంబులు పెడ్తే.. రేపు ఉదయం లేస్తారా?

చేపలు కూర.. ఒకరి హత్య, ఏడుగురికి జైలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist