కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించి తిరిగి విగ్రహాలను భారతదేశానికి రప్పించి అందరి మన్ననలు అందుకుంది. మరి ఈ సీతా రామ, లక్ష్మణ విగ్రహాల చరిత్రేంటో చూద్దాం రండి.
రాజుల కాలం నాటి విగ్రహాలు
రాజుల కాలంలో ఎందరో తమ వైభవాలకు, భక్తి ప్రపత్తులకు గుర్తుగా ఎన్నో ఆలయాలను నిర్మించారు. అందులో భాగంగా విజయనగర రాజుల హయాంలో తమిళనాడులో నిర్మించిన శ్రీ రాజ గోపాల్ విష్ణు ఆలయం నుంచి రామ, సీత, లక్ష్మణ కాంస్య విగ్రహాలు 1978 నవంబరు 23,24 తేదీల సమయంలో దొంగతనానికి గురయ్యాయి. అవి దేశం దాటి లండన్ లోని వ్యక్తికి విక్రయించడం కూడా జరిగిపోయింది.
ఫొటోల ఆధారంగా
అలా చోరికి గురయిన విగ్రహాలు నాటి నుండి నేటి వరకు జాడ లేకుండా పోయాయి. ఇటీవల ఈ విగ్రహాల చోరిని గుర్తించిన ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అధికారులు 1958 లో తీసిన ఫొటోలను ఆధారంగా చేసుకుని వాటిని వెతకడం మొదలు పెట్టారు. విచారణలో భాగంగా ఈ విగ్రహాలు లండన్ తరలిపోయినట్లుగా గుర్తించారు. అక్కడి అధికారులకు వివరాలను అందించారు. వారి సహాయంతో, చివరికి విగ్రహాలను గుర్తించి సెప్టంబర్ 15 న లండన్ లోని భారతీయ కమిషన్ కి వాటిని అప్పగించారు.
దొంగలు దొరికారు
విగ్రహాలు మాత్రమే కాదు, దొంగలు కూడా దొరికారు. దాదాపు 40 ఏళ్ల క్రితం చోరికి గురయ్యిన విగ్రహాలను సొంతం చేసుకున్న యజమానితో సహా, వాటిని విక్రయించిన దొంగలను కూడా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆ విగ్రహాలు భారత్ కు చేరుకున్నాయి. పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించి, విగ్రహాలను తమిళనాడు విగ్రహాల విభాగం వారిని అప్పగించారు. అంతేకాదు, విగ్రహాలను కనిపెట్టి భారత్ కు అప్పగించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసించారు.
40 శిల్పాలను అప్పగించాం
భారతదేశం నుంచి ఇలా విగ్రహాలు తరిలిపోవడం కొత్తేమీ కాదు. దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం నుండే కొన్ని వందల విగ్రహాలు విదేశాలకు తరలిపోయాయి. వాటిని గుర్తించడంలో ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం ఫొటోలు లేకపోవడం వల్ల చాలా విగ్రహాలను గుర్తించినా నిరూపించే ఆధారాలు దొరకడం లేదు. అధికారక లెక్కల ప్రకారం, 1976 తర్వాత అక్రమంగా విదేశాలకు తరలి పోయిన విగ్రహాలలో 53 శిల్పాలను గుర్తించి భారతదేశానికి రప్పించారు. అందులో 40 దాదాపు 2014 తర్వాత రప్పించడం గమనార్హం. వీటినే కాదు, మిగిలిన విగ్రహాలను రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు పర్యాటక శాఖ మంత్రి వెల్లడించారు.
Must Read ;- మరో మతం గొడవ షురూ: రాముడి తరవాత ఇక కృష్ణుడే











